ఎంతోమంది సినీ పరిశ్రమకు వస్తారు.కానీ కొందరే వారిలో ట్యాలెంట్ ని నిరూపించుకోగలరు.
ఆ కొందరే అభిమానులను సంపాదించుకోగలరు.అలానే విలక్షణ నటుడైన ఆహుతి ప్రసాద్ కూడా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
కమెడియన్ గా, విలన్ గా, మంచి తండ్రిగా, పోలీస్ గా ఇలా ఏ పాత్ర అయినా సరే అద్భుతంగా నటించి తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యాడు.నటన అంటే ఆహుతి ప్రసాద్ దే అనేలా నటించాడు.
అయన ఉన్న సినిమాలకు.ఆయనలేని సినిమాలకు చాల తేడా కనిపిస్తుంది.ఎందుకంటే నటనలో ఆయనకు ఉన్న ట్యాలెంట్ అలాంటిది.నటన అంటే ఆహుతి ప్రసాదే మరి.150కిపైగా సినిమాల్లో నటించిన ఈ విలక్షణ నటుడు కోలన్ కాన్సర్ వ్యాధి భారిన పడి 57 ఏళ్లకే కన్నుమూశారు.ఆహుతి ప్రసాద్ లేని లోటు మరో నటుడు ఎప్పటికి పూడ్చలేరనే చెప్పాలి.
సుమారు 30 ఏళ్ళు అయన నటనతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు.
చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే ఎంతో ఆసక్తి ఉండడంతో ఆహుతి ప్రసాద్ ఎలా అయినా ఇండస్ట్రీలో అడుగుపెట్టాలి అనుకున్నాడు.ఆలా అనుకున్నట్టుగానే ఆహుతి ప్రసాద్ అక్కినేని నాగార్జున తొలి చిత్రం విక్రమ్ తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు.ఇక ఆతర్వాత చిన్న పెద్ద పాత్ర అని తేడా లేకుండా వచ్చిన ప్రతి పాత్రలో నటించుకుంటూ వెళ్ళాడు.
ఇక అలానే రాజశేఖర్ చిత్రం అయినా ఆహుతి అనే సినిమాలో కూడా మెయిన్ విలన్ గా నటించాడు.ఆ సినిమాలోనే అయన పాత్రకు మంచి గుర్తింపు రావడంతో అయన పేరు వర ప్రసాద్ అవ్వడంతో అతని పేరు ఆహుతి ప్రసాద్ అయ్యింది.
ఇక అలంటి ఆహుతి ప్రసాద్ కు ఎంతో అందమైన కొడుకు ఉన్నాడు.కానీ ఈ విషయం చాలామందికి తెలియదు.
ఆహుతి ప్రసాద్ యాంగ్ ఏజ్ లో ఎంత అందంగా ఉన్నడో అంతే అందంగా ఆహుతి ప్రసాద్ కొడుకు కూడా ఉన్నాడు.అతని పేరు కార్తీక్ ప్రసాద్.
చూడటానికి అచ్చం హీరోలా ఉన్న అతను సినిమాల్లోకి రాలేదు.