ఇండియాలోనే కాకుండా ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కూడా కరోనా వైరస్ భయభ్రాంతులకు గురి చేస్తున్న విషయం తెల్సిందే.కరోనా సోకిన వారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డులో ఉంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు.
అక్కడకు ఇతరులు ఎవరు కూడా వెళ్లకూడదు.సొంత వారితో పాటు కనీసం వైధ్యులు కూడా వారి వద్దకు వెళ్లేందుకు భయపడుతున్నారు.
కరోనా కారణంగా వారి రోగ నిరోధక శక్తి చాలా క్షీణిస్తుంది.ఆ కారణంగా వారికి ఇన్ఫెక్షన్ రావద్దనే ఉద్దేశ్యంతో అక్కడ పరిసరాల్లోకి ఎవరు వెళ్ల కూడదంటారు.
కరోనా వైరస్ సోకిన వారికి ఇచ్చే ట్రిట్మెంట్ చాలా విభిన్నంగా ఉంటుందట.దాదాపుగా రెండు వారాల పాటు పూర్తిగా వారు చనిపోయిన శవం మాదిరిగా బెడ్ కే పరిమితం అయ్యి ఉండాలి.కాస్త అజాగ్రత్తగా ఉన్నా కూడా ఇతరులకు సోకడంతో వారిని నిర్భందించి ఉంచుతున్నారు.కరోనా వైరస్ సోనిక వారు చాలా మందిని ఐసోలేషన్ వార్డుల్లో ఉంచి ట్రీట్మెంట్ ఇస్తూ ఉండగా కొందరు పారిపోతున్నట్లుగా మనం వార్తల్లో చూస్తూనే ఉన్నాం.
ట్రీట్మెంట్తో చంపేసేట్లుగా ఉన్నారంటూ బయటకు వచ్చిన వారు అంటున్నారు.కరోనా వచ్చిందో రాలేదో తెలియకుండానే కొందరిని నిర్భందంలోకి తీసుకుంటున్నారు.అలాంటి వారు పారిపోయి బయటకు వచ్చిన తర్వాత బాబోయ్ ఆ ఐసోలేషన్ వార్డులో కనీసం 10 నిమిషాలు కూడా ఉండటం సాధ్యం కాదు.అందులో ఉండటం కంటే చనిపోవడం బెటర్ ఏమో అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అత్యంత దారుణంగా నిర్ధాక్షిణ్యంగా ఉండే ఐసోలేషన్ వార్డుకు ఎవరు పోవద్దని కోరుకుందాం.