ప్రస్తుతం బుల్లితెర లో ఎంతోమంది యాంకర్స్ ఉన్న సంగతి మనకు తెలిసిందే.అందులో ఎక్కువగా ఫిమేల్ యాంకర్స్ ఉండటమే కాకుండా బుల్లితెరలో వారి సత్తా కూడా అంతే ఎక్కువగా ఉంది.
ఇప్పటికే సుమ, అనసూయ, రష్మీ లే కాకుండా మరెందరో యాంకర్లు మంచి గుర్తింపు పొందారు.ఇదిలా ఉంటే వీరంతా ఎక్కడి నుండి వచ్చారో చాలా వరకు ఎవరికీ తెలియదు.
కానీ వాళ్ళ కెరీర్ కోసం ప్రస్తుతం హైదరాబాద్ లో సెటిల్ అవగా.అసలు వాళ్ల సొంతం ప్రాంతాలు ఏంటో తెలుసుకుందాం.
ప్రస్తుతం బుల్లితెరలో స్టార్ యాంకర్ మంచి గుర్తింపు పొందిన సుమ పరిచయం గురించి తెలీనోలే లేరు.ఇక ఈమె కేరళ కు చెందగా.చాలా కాలం నుండి హైదరాబాద్ లో ఉంటుంది.ఇక యాంకర్ ఉదయభాను తెలంగాణ కు చెందిన కరీంనగర్ జిల్లా, సుల్తానాబాద్ నుండి ప్రేక్షకులకు పరిచయం అయింది.
ఇక మరో సీనియర్ యాంకర్ ఝాన్సీ కూడా హైదరాబాద్ లోనే తన స్వస్థలం.
ఇక గ్లామర్ బ్యూటీ యాంకర్ అనసూయ గురించి అందరికీ తెలిసిందే.
ఈమె తెలంగాణ కు చెందగా.అనసూయ తండ్రి ది నల్గొండ జిల్లా పోచంపల్లి గ్రామం.
తన తల్లిది కర్ణాటకలోని రాయచూర్ ప్రాంతాలకు చెందిన వాళ్లు.ప్రస్తుతం అనసూయ హైదరాబాద్ లోనే సెటిల్ అయింది.
మరో గ్లామర్ బ్యూటీ రష్మీ గౌతమ్ ఆంధ్రప్రదేశ్ కు చెందగా తాను విశాఖపట్నం లో జన్మించింది.తన తండ్రి ఉత్తర ప్రదేశ్, తన తల్లి ఒడిస్సా రాష్ట్రానికి చెందిన వాళ్లు.
మరో గ్లామర్ యాంకర్ శ్రీముఖి యాంకరింగ్ గురించి, తన అల్లరి గురించి ఎంత చెప్పిన తక్కువే.ఇక ఈమె నిజామాబాద్ కు చెందింది.ఇక మరో సీనియర్ యాంకర్ శ్యామల ఆంధ్ర ప్రదేశ్ కాకినాడలో జన్మించింది.ప్రస్తుతం ఆమె కూడా హైదరాబాద్ లో సెటిల్ అయింది.ఇక ప్రస్తుతం బుల్లితెర లో తన గ్లామర్ తో ఆకట్టుకుంటున్న వర్షిణి తమిళనాడుకు చెందిన ముద్దుగుమ్మ.ఇక తన కుటుంబం తో పాటు హైదరాబాద్ లోనే సెటిల్ అయ్యింది.
ఇక మరో గ్లామర్ యాంకర్ విష్ణు ప్రియ సొంత ఊరు ప్రకాశం జిల్లా.ఇక వాళ్ళ నాన్న ఉద్యోగం కోసం చిన్నప్పుడే హైదరాబాద్ కి వచ్చారు.ఇక మరో యాంకర్ మంజూష.ప్రస్తుతం ఈమె కూడా గ్లామర్ తో ఆకట్టుకోగా ఈమె కూడా తెలంగాణ రాష్ట్రానికి చెందగా ప్రస్తుతం హైదరాబాదులో నివాసం ఉంటుంది.