ఇప్పుడు పాన్ ఇండియా సినిమా దగ్గర మోస్ట్ అవైటెడ్ మూవీ ఏది అంటే డార్లింగ్ ప్రభాస్ నటిస్తున్న ‘ఆదిపురుష్( Adipurush )’ అనే చెప్పాలి.ఇతిహాస గ్రంధం రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్( Prabhas ) రాముడిగా నటించడంతో ఫ్యాన్స్ ఈయనను వెండితెర మీద ఎప్పుడెప్పుడు రాముడి పాత్రలో చూడాలా అని ఎదురు చూస్తున్నారు.
బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియాడిక్ వండర్ లో కృతి సనన్ సీత పాత్రలో నటిస్తున్న విషయం విదితమే.అలాగే సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడిగా నటిస్తుండగా.
సన్నీ సింగ్( Sunny Singh ) లక్షణుడిగా నటిస్తున్నాడు.తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ సినిమాను టి సిరీస్ సంస్థ, రిట్రో ఫైల్స్ 500 కోట్ల భారీ బడ్జెట్ తో సంయుక్తంగా నిర్మించారు.
మరో 10 రోజుల్లో గ్రాండ్ రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈ సినిమా నుండి వరుసగా అప్డేట్ లను ఇస్తూ మరింత క్రేజ్ పెంచుతున్నారు.ఇదిలా ఉండగా ఇప్పటికే ఆంధ్రాలో తిరుపతి వేదికగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే.ఈ ఈవెంట్ లో అదిరిపోయే సర్ప్రైజ్ లను మేకర్స్ ప్లాన్ చేసినట్టు ఇప్పుడు తెలుస్తుంది.జూన్ 6న తిరుపతిలో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది.
మరి ఈ ఈవెంట్ కోసం మేకర్స్ 3 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారు అని టాక్ వస్తుంది.ఈ ఈవెంట్ కోసం ఏకంగా 200 మంది సింగర్స్, 200 మంది డ్యాన్సర్లను తీసుకు వస్తున్నారని వీరు లైఫ్ పెర్ఫార్మెన్స్ చేయనున్నారని టాక్.అలాగే ఈ సినిమా నేపథ్యంలో ఈవెంట్ కూడా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా కనిపించడం కోసం భారీ సెట్టింగ్స్ వంటివి వేయిస్తున్నారట.మొత్తానికి ఈవెంట్ కోసమే అంత బడ్జెట్ పెట్టి మరోసారి వార్తల్లో నిలుస్తుంది.