బీహార్ సీఎం నితీష్ కుమార్ దేశంలోనే చాలా విభిన్నమైన సీఎంగా పేరు దక్కించుకున్నాడు.ఎందుకంటే గత పది సంవత్సరాలుగా ఆయన ప్రతి ఏడాది కూడా తన మరియు తన మంత్రి వర్గంలోని మంత్రుల ఆస్తులను బహిరంగంగా ప్రకటిస్తున్నారు.
ప్రతి ఏడాది నితిష్ కుమార్ తన ఆస్తులను ప్రకటిస్తూ వస్తున్నాడు.ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా ఆయన ఆస్తులను ప్రకటించాడు.
అయితే గతంలో మాదిరిగానే ఈ సారి కూడా నితిష్ కుమార్ ఆస్తులు ఏమీ పెరగలేదు.ఆయన వద్ద ఉన్న నగదు నిల్వ తగ్గింది.
నిన్న ఆస్తులను ప్రకటించిన నితిష్ కుమార్ గతంలో చెప్పినట్లుగానే ఈసారి కూడా తన వద్ద ఉన్న ఆవులు మరియు దూడలు, స్థిర మరియు చర ఆస్తులను ప్రకటించాడు.ఎప్పటిలాగే ఢిల్లీలో తన ప్లాట్ ఉందని, 16 లక్షల విలువైన చరాస్తులు ఉన్నాయని 40 లక్షలు విలువ చేస్తే స్థిరాస్తులు ఉన్నాయంటూ ప్రకటించాడు.
ఇక గత సంవత్సరం ఎమినిమి ఆవులు మరియు ఆరు దూడలు ఉన్నట్లుగా నితిష్ చూపించారు.ఇక ఈ ఏడాది రెండు ఆవులు పెరిగాయి.అంటే మొత్తం పది ఆవులు మరియు ఏడు దూడలు ఉన్నట్లుగా తన ఆస్తుల వివరాల్లో ప్రకటించాడు.ఒక సీఎం ఆస్తులు సంవత్సరంలో ఏమాత్రం పెరగక పోవడం మంచి విషయమే.
కాని ఇందులో ఎంత నిజం ఉందో ఆ దేవుడికే తెలియాలి.