సాధారణంగా మన ఇంట్లో ఏదైనా పండుగలు జరిగినప్పుడు, లేదా పూజలు, వ్రతాలు, శుభ కార్యాలు జరిగినప్పుడు అరటి ఆకులో భోజనం చేయడానికి ఇష్టపడుతుంటారు.కేవలం భోజనం చేయడానికి ఇష్టపడతారు కానీ, అందులో భోజనం చేయడం వల్ల ఎన్ని లాభాలు పొందుతారు అనేది బహుశా అందరికి తెలియకపోవచ్చు.
మరి అరిటాకులో భోజనం చేయడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.అవి ఏంటి అనేది ఇక్కడ తెలుసుకుందాం.
పూర్వం మన పెద్దవారికి అరటి చెట్టు విరివిగా లభించడం వల్ల ప్రతిరోజు అరటి ఆకులో భోజనం చేసేవారు.అందుకే వారు ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు.పూర్వం రాజులు ఎక్కువగా అరిటాకులో భోజనం చేసేవారు అలా చేయడం ద్వారా శత్రువులెవరైనా అన్నంలో విషం కలిపితే, ఆకు నీలిరంగుగా మారిపోతుంది.అరటి ఆకులపై ఆహారం వడ్డించే సంప్రదాయం భారత దేశానికి చాలా కాలంగా ఉంది.
ముఖ్యంగా దక్షిణాన ఉన్న ప్రదేశాలలో, అరటి ఆకులో ఆహారం తినడం చాలా ఆరోగ్యకరమైన ఇంకా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది.అరటిలో సహజ యాంటీ ఆక్సిడెంట్లు, పెద్ద మొత్తంలో పాలీఫెనాల్స్ ఉంటాయి.
ఇవి మొక్కల ఆధారిత ఆహారాలు ఇంకా గ్రీన్ టీలలో కనిపిస్తాయి.అరటి ఆకులపై వడ్డించే ఆహారం అనేక జీవనశైలి వ్యాధులను నివారించగలుగుతుంది.
అవి యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉంటాయి.ఇవి ఆహారంలో సూక్ష్మజీవులను చంపడమే కాకుండా, రోగనిరోధక శక్తిని పెంచడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి.అరటి ఆకులలో పొటాషియం ఎక్కువగా ఉండడం వల్ల గుండె సమస్యల నుంచి దూరం చేయడమే కాకుండా, రక్త పోటును నియంత్రించగలదు.పాలీఫెనాల్స్ క్యాన్సర్ కారకాలను నిరోధించి క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది.
అరటి ఆకులో భోజనం ఆరోగ్యానికే కాకుండా పర్యావరణానికి కూడా ఎంతో మేలు చేస్తుంది మనం తిని పడేసిన ఆకుల వ్యర్థాలు భూమిలో తొందరగా కలసి మంచి కంపోస్టుగా ఉపయోగపడుతుంది.దీనివల్ల పర్యావరణానికి ఎటువంటి హాని కలుగదు.