భారతదేశంలో వెబ్ సిరీస్ హావ ఇప్పుడిప్పుడే బాగా జోరందుకుంది.4 సంవత్సరాల క్రితమే భారతదేశంలో వెబ్ సిరీస్ సంబంధించి ట్రెండ్ మొదలవగా లాక్ డౌన్ సమయంలో దీని ప్రాధాన్యత మరింతగా పెరిగింది.సినీ వర్గాల నుంచి ఎటువంటి సినిమాలు సినిమా హాల్స్ లో రిలీజ్ చేయకపోవడంతో సినీ వర్గాల పెద్దలు కూడా చివరికి వెబ్ సిరీస్ కే ఓటేశారు.దీంతో సినీ ప్రముఖులు అలాగే సినీ ప్రేక్షకులు కూడా పూర్తిగా వెబ్ సిరీస్ పైపు చూస్తున్నారు.
అయితే ఇందుకు కారణం లేకపోలేదు.ఒక్కసారి ఓ యాప్ కు నెలకు సంబంధించి డబ్బులు కడితే ఇంటిల్లిపాది ఇంట్లోనే హెచ్డీ క్వాలిటీతో సినిమాను చూసేయవచ్చుఅని భావిస్తున్నారు.
అయితే ఇది వరకు ఈ వెబ్ సిరీస్ ను చూసేవారు చాలా తక్కువ.
ఇది ఇలా ఉండగా అసలు విషయంలోకి వెళితే ప్రస్తుతం క్వాలిటీ కంటెంట్, అలాగే నటీనటుల పెర్ఫార్మెన్స్ బాగుంటేనే వెబ్ సిరీస్ కూడా హిట్ అవుతుంది.
ఇందులో భాగంగానే తాజాగా ఓ వెబ్ సిరీస్ భారత దేశ ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటుంది.అది ” స్కామ్ 1992 “. 90వ దశకంలో ఏర్పడిన స్టాక్ మార్కెట్ కుంభకోణంతో దేశంలో అతి పెద్ద సంచలనం రేపిన హర్షద్ మెహతా జీవితాన్ని ఆధారంగా తీసుకొని తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్ ఇప్పటికే ఎంతోమందిని ఆకర్షించింది.
అలాగే సినీ క్రిటిక్స్ నుంచి ఎన్నో ప్రశంసలను అందుకుంది.
హన్సల్ మెహతా వెబ్ సిరీస్ ను తెరకెక్కించాడు.ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సిరీస్ ప్రస్తుతం భారత దేశంలో ట్రెండింగ్ గా మారింది.
ఈ వెబ్ సిరీస్ సోనీ లైవ్ యాప్ లో విడుదలైంది.ఈ వెబ్ సిరీస్ ను చూస్తున్న ప్రతి ఒక్కరి నుండి విశేష స్పందన ను రాబట్టుకుంటోంది.
ఇకపోతే బాలీవుడ్ లో ఓ సినీ క్రిటిక్ ఈ వెబ్ సిరీస్ స్క్రిప్ట్ తో ఫిలిం ఇన్స్టిట్యూట్లో తరగతులను చెప్పవచ్చు అంటూ తెలిపాడు.