ప్రపంచంలో మొట్టమొదటి సముద్ర తీర భూమి ఎక్కడ ఏర్పడిందో మీకు తెలుసా.? ఇప్పటివరకూ కొన్ని కోట్ల సంవత్సరాల కిందట లావా చల్లబడి సముద్రాల్లో హెచ్చుతగ్గుల వల్ల భూమి ఏర్పడిందని మాత్రమే మనకు తెలుసు.కానీ సైంటిస్టులు మొట్టమొదటి సముద్రతీర భూమి ఎక్కడ, ఎప్పుడు ఎలా ఏర్పడిందనే ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.జార్ఖండ్ రాష్ట్రంలోని సింగ్ భూమి ప్రాంతంలోనే ఏర్పడిందని సైంటిస్ట్ లు తేల్చేశారు.
భారత్, ఆస్ట్రేలియా, అమెరికా శాస్త్రవేత్తలు చేసిన సంయుక్త పరిశోధనల్లో సముద్ర మట్టానికి పైన 330 నుంచి 320 కోట్ల సంవత్సరాల మధ్య కాలంలో ఈ స్థిరమైన ఖండాంతర భూభాగాలు ఏర్పడినట్లు గుర్తించారు.
నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ లో ఇటీవలే ప్రచురితమైన పేపర్లో ఈ ఆసక్తికరమైన విషయాలను పరిశోధక బృందం వెల్లడించింది.
భూమికి 35 నుంచి 45 కిలోమీటర్ల లోతులో అగ్నిపర్వతాల నుంచి సిసీలియా, క్వార్ వంటి తేలికైన రసాయనాలు విడుదల అయ్యాయని, అవి కాస్త చల్లబడి పైకి తేలి భూమిగా ఏర్పడినట్లు సైంటిస్టులు తెలిపారు.అయితే ఇదంతా జరగడానికి కొన్ని వందల సంవత్సరాలు ఉండొచ్చని కూడా తెలిపారు.
కొన్ని ప్రత్యేక పోషకాలు సముద్ర నీటిలోకి చేరడం వల్లనే నీటి నుంచి ఆక్సిజన్ తయారయిందని అన్నారు .అలాగే ఉప వాయువు పెరుగుదల దాదాపు 250 కోట్ల సంవత్సరాల కిందటే ప్రారంభమైందని సైంటిస్టులు ఏకాభిప్రాయానికి వచ్చారు.అనంతరం బీచ్ నివాసయోగ్యమైన భూమి ఏర్పడింది అన్నది వారి నమ్మకం.అక్కడి తీరంలో ఉన్న నదీ మార్గాలు, ఇసుక రాళ్లను విశ్లేషించిన అనంతరం ఈ నిర్ణయానికి వచ్చినట్లు వారు తెలిపారు.
ఎంతకాలం అలా నీటిపై తేలుతూ ఉన్నాయని కానీ, ఎంత భూభాగం ఏర్పడిందని కానీ ఇప్పటికీ స్పష్టత లేదు.
ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త ప్రియదర్శి చౌదరి మాట్లాడుతూ… అ ప్రత్యేకమైన అవక్షేప శిలలను గుర్తించామని వాటి వయస్సు కొన్ని వందల బిలియన్ సంవత్సరాల పట్టి ఉండొచ్చని, అలాగే వాటి వయసు అవి ఎలాంటి పరిస్థితుల్లో ఏర్పడ్డాయని విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.ఉన్న యురేనియం లెఫ్ట్ కంటెంట్ ను బట్టి వాటి వయసును కనుక్కోగలరా అని 310 కోట్ల సంవత్సరాల కిందటి పని తెలిపారు.దాదాపు ఇదే కాలంలో దక్షిణ ఆఫ్రికా లోని క్యాప్ వాల్, క్రోటన్ ఆస్ట్రేలియాలోని, పిల్ బరా కాటన్ ఏర్పడి ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.