సిరి వెన్నెల సీతారామశాస్త్రి.తెలుగు పాటకి కమ్మదనాన్ని అద్దిన మహాకవి.
పాటతో గుండె గాయానికి మందు రాసిన సాహితీ వైద్యుడు ఆయన.జీవితంలో ప్రతి క్షణం ఆయన పాట కోసమే పరితపించారు.త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పినట్టు ఆయన తన సొంత మనుషులతో కూడా పెద్దగా మాట్లాడేవారు కాదు.జగమంత కుటుంబం అని పాడుకున్న తన సొంత కుటుంబాన్ని కూడా అందులో కలిపేసుకున్నారు.
కానీ.ఎప్పుడూ కూడా సిరివెన్నెల తన కుటుంబం కోసం ప్రత్యేకంగా ఇది చేయాలని పరితపించింది లేదు.
వాళ్ళకి ఆయన గురి మాత్రమే చూపించారు.విజయానికి కావాల్సిన మార్గాన్ని వారినే ఎంచుకోమన్నారు.
ఇందుకే సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇద్దరు కుమారులు సినీ పరిశ్రమలోనే ఉన్నా ఆ విషయం చాలా మందికి తెలియదు.
సిరివెన్నెల భార్య పేరు పద్మావతి.వీరికి రాజా, యోగేష్ అని ఇద్దరు కుమారులు ఉన్నారు.సిరివెన్నెల కొడుకులు తండ్రి స్పూర్తితోనే సినీరంగ ప్రవేశం చేశారు.
కానీ వీరిలో ఒకరు సంగీతం వైపు అడుగులు వేయగా, మరొకరు నటన వైపు అడుగులు వేశారు.సిరివెన్నెల పెద్దబ్బాయి యోగేశ్వర్ శర్మ ‘కుదిరితే కప్పు కాఫీ’ సినిమాతో సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు.
తర్వాత ‘రంగు’ వంటి పలు సినిమాలకు మ్యూజిక్ కంపోజ్ చేశారు.కానీ తరువాత కాలంలో ఆయన అంతగా క్లిక్ కాలేకపోయాడు.
కానీ ఈ విషయంలో కూడా సిరివెన్నెల ఎప్పుడూ బాధపడుతూ కామెంట్స్ చేసిన సందర్భాలు లేవు.
ఇక చిన్నబ్బాయి రాజా చేంబోలు నటుడిగా నిరూపించుకున్నారు.‘కేక’ సినిమాతో హీరోగా ఇంట్రడ్యూస్ అయిన రాజా.రామ్ చరణ్ ‘ఎవడు’ మూవీలో నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ చేసి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
తర్వాత పలు సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఈ మధ్యనే పెళ్లి చేసుకోవడం విశేషం.అయితే.సిరివెన్నెలకి కొడుకులను ప్రమోట్ చేయడం ఇష్టం ఉండేది కాదు.
వాళ్లే సొంతగా టాలెంట్ తో ఎదగాలి అన్నది ఆయన అభిమతం.అందుకే చాలా కాలంగా ఇండస్ట్రీలో ఉన్నా, సిరివెన్నెల కొడుకులు అని ఎవ్వరికి పెద్దగా తెలియదు.
చూశారు కదా? ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.