నాగచైతన్య, సమంత విడాకుల గురించి గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి.ఈ నేపథ్యంలో వాటన్నిటికి ఫుల్ స్టాప్ పెడుతూ తాము విడిపోతున్నట్లు అఫీషియల్గా నాగచైతన్య, సమంత సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
తాము ఇక ఎవరి దారిలో వారు సొంతంగా పయనించనున్నట్లు పేర్కొన్నారు.ఈ క్రమంలో నాగచైతన్య-సమంత పెళ్లికి సంబంధించిన పలు విషయాలు తెలుసుకుందాం.
గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ‘ఏ మాయ చేసావే’ చిత్రంలో నాగచైతన్య, సమంత ఫస్ట్ టైమ్ కలిశారు.ఈ ఫిల్మ్ లవ్ స్టోరి కావడం, వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ఆన్ స్క్రీన్ బాగా వర్క్ అవుట్ కావడం, ఆ తర్వాత కాలంలో వీరిద్దరి మధ్య రిలేషన్ షిప్ కొనసాగడం జరిగింది.
అలా వీరు చాలా కాలం పాటు మంచి స్నేహితులుగా కొనసాగారు.అయితే, చైతన్య పుట్టినరోజున అభిమాన వ్యక్తికి పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ సమంత అని సోషల్ మీడియాలో పేర్కొనడంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందని చర్చ షురూ అయింది.అలా చివరకు నాగచైతన్య తన తండ్రికి నాగార్జునకు సమంతతో లవ్లో ఉన్నట్లు పేర్కొనడం, ఇంట్లో యాక్సెప్ట్ చేయడం చక చకా జరిగిపోయి, వారు మ్యారేజ్ చేసుకున్నారు.2017లో గోవాలో పెళ్లి జరిగింది.
ఇక పెళ్లిలో ముఖ్య ఘట్టాలైన నిశ్చితార్థం, పెళ్లి, విందు ఇలా ప్రతీ వేడుకలో సమంత, చైతన్య ధరించిన డ్రెస్సెస్ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాయి.ఇందుకు కారణం అవి స్పెషల్గా డిజైన్ చేయించినవి కావడం.
ప్రముఖ డిజైనర్ క్రేశా బజాజ్ రూపొందించారు సమంత, నాగచైతన్య డ్రెస్సెస్.
ఎంగేజ్మెంట్ రోజున సమంత ధరించిన చైతన్య ఫ్యామిలీకి వెరీ స్పెషల్ అని చెప్పొచ్చు.మ్యారేజ్కు కూడా డిజైనర్ స్పెషల్ శారీ, లెహంగాలను డిజైన్ చేశారు.ఎంగేజ్మెంట్ రోజున సమంత కట్టుకున్న చీర చైతన్య అమ్మమ్మ అనగా గిన్నిస్ రికార్డు ప్రొడ్యూసర్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత దగ్గురాటి రామనాయుడు భార్య దగ్గుబాటి రాజేశ్వరి చీర.
ఆ చీరను రీ మోడలింగ్ చేసి ప్రత్యేకంగా డిజైన్ చేశారు డిజైనర్ క్రేశా బజాజ్.ఈ శారీ కోసం అప్పట్లో రూ.40 లక్షలు ఖర్చు అయినట్లు తెలుస్తోంది.ఇక తన పెళ్లికి సంబంధించిన ప్రతీ దానికి డిజైనర్ క్రేశా బజాజ్ను నమ్మినట్లు సామ్ గతంలో పలు ఇంటర్వ్యూల్లో పేర్కొంది.
ఇక ఇప్పుడు విడాకుల నేపథ్యంలో సమంత ధరించిన ఈ వెడ్డింగ్ చీర ను తిరిగి అక్కినేని ఫ్యామిలీకి అప్పగించనున్నట్టు సమాచారం.