తెలంగాణ కోసం పోరాడిన పార్టీగా టీఆర్ఎస్ కు గొప్ప చరిత్ర ఉంది.ప్రజల్లో గొప్ప పేరు కూడా ఉన్న పరిస్థితి ఉంది.
అయితే గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఎదురులేనటువంటి పరిస్థితి ఉంది.అయితే ఒకప్పటి పరిస్థితికి ఇప్పటి పరిస్థితికి చాలా తేడా ఉన్న పరిస్థితి ఉంది.
దీంతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్షాలు అన్నీ కెసీఆర్ ప్రభుత్వం విమర్శల దాడిని పెద్ద ఎత్తున పెంచుతున్న పరిస్థితి ఉంది.అయితే టీఆర్ఎస్ మాత్రం అన్ని పక్షాల నుండి విమర్శలు ఎదుర్కొంటుండటంతో కొంత అసంతృప్తిగా ఉన్న నేతలు పక్క చూపులు చూస్తుండటంతో ఒక్కసారిగా టీఆర్ఎస్ ఇక బలహీన పడుతుంది అనే సంకేతాలను ప్రజల్లోకి వెళ్ళేలా ఇటు బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది.
కానీ ఇప్పటి వరకు కెసీఆర్ ఒక్కసారి మాత్రమే మాట్లాడటంతో బీజేపీ కొంత ఇరుకునపడ్డ పరిస్థితి ఉంది.
అయితే టీఆర్ఎస్ కు ఉన్న ప్రస్తుత అడ్డంకి ఏంటంటే టీఆర్ఎస్ వాయిస్ అనేది ప్రజల్లోకి బీజేపీ వాయిస్ వెళ్లినంతగా వెళ్లని పరిస్థితి ఉంది.
అందుకే ఇటీవల నిర్వహించిన విలేఖరుల సమావేశంలో మా వాళ్ళు మాట్లాడితే ప్రజల్లోకి వెళ్లని పరిస్థితి ఉంది.అందుకే స్వయంగా నేనే ప్రెస్ మీట్ నిర్వహించాల్సి వస్తున్నదని కెసీఆర్ వ్యాఖ్యానించిన పరిస్థితి ఉంది.
ఏది ఏమైనా టీఆర్ఎస్ పై ముప్పేట దాడి మొదలైన పరిస్థితిలో కెసీఆర్ ఈ పరిస్థితులను తమకు అనుకూలంగా ఎలా మార్చుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.అయితే టీఆర్ఎస్ మాత్రం ఇప్పుడు క్షేత్ర స్థాయిలో జరుగుతున్న పరిణామాల పట్ల స్పందించకుంటే చాలా ప్రమాదమని టీఆర్ఎస్ నేతలు చెబుతున్న పరిస్థితి ఉంది.
ఏది ఏమైనా తెలంగాణ రాజకీయాల్లో రణరంగం పెద్ద ఎత్తున ఉండే అవకాశం ఉంది.మరి భవిష్యత్ తెలంగాణ రాజకీయ ముఖ్య చిత్రం ఎలా ఉంటుందనేది చూడాల్సి ఉంది.