మన దగ్గర మందుకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు.ప్రతి విషయాన్ని సెలబ్రేట్ చేసుకోవాలంటే కచ్చితంగా మందు ఉండాల్సిందే.
పండుగ అయినా విషాదం అయినా మందు లేకపోతే అస్సలు నడవదు.ఇక కొత్తగా ఎవరైనా కలిస్తే మందుతోనే పరిచయాలు పెరుగుతాయి.
ఇక ఇంట్లో ఏదైనా పండుగ చేస్తే మాత్రం మద్యంతో విందు ఉండాల్సిందే.లేకపోతే ఎవరూ ఒప్పుకోరు.
అయితే మద్యం తాగే సమయంలో చాలామంది ఏదో ఒక స్టఫ్ తీసుకుంటారు.ఇందులో చాలా రకాలు ఉంటాయి.
నాన్ వెజ్ నుంచి మొదలు పెడితే చిప్స్ వరకు ఉంటాయి.
అయితే ఇందు కొన్ని రకాల స్టఫ్ను మద్యం తాగేటప్పుడు తీసుకుంటే ప్రాణాలకే ప్రమాదమని తెలుస్తోంది.
ముఖ్యంగా జీడిపప్పుతో పాటు వేరుశెనగ తింటే శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణం భారీగా పెరిగిపోయి ఫ్యాట్ వస్తుందని చెబుతున్నారు.ఇది ఉండాల్సిన దాని కంటే ఎక్కువగా వస్తుందని హెచ్చరిస్తున్నారు.
వీటితో పాటు సోడా, కూల్డ్రింక్స్ లాంటి వాటిలో కలుపుకుని తాగడం చాలామందికి అలావాటు.ఇవి మద్యంతో తాగితే బాడీలో నీటి శాతం భారీగా పడిపోయి ఇమ్యూనిటీ పవర్ మీద దెబ్బ పడుతుందని డాక్టర్లు చెబుతున్నారు.
అలాగే ఫ్రై చేసిన స్నాక్స్ కూడా అత్యంత ప్రమాదమని తెలుస్తోంది.నిజానికి చాలామంది మద్యం తాగేటప్పుడు ఇలాంటి ఫ్రై స్నాక్స్ ను తీసుకుంటారు.అయితే ఇలాంటివి ఆరోగ్యానికి హానీ చేస్తాయంటూ వెల్లడిస్తున్నారు డాక్టర్లు.ఇక మరీ ముఖ్యంగా మద్యం తాగిన తర్వాత పాల పదార్థాలు అస్సలు తీసుకోవద్దు.ఇది జీర్ణ వ్యవస్థను దెబ్బ తీస్తుంది.ఇక ఫైనల్ గా స్వీట్లు కూడా తినకూడదు.
స్వీట్ల కారణంగా మత్తు రెట్టింపు అయి విషపూరితంగా బాడీ తయారవుతుందని నిపుణులు వెల్లడిస్తున్నారు.పైవాటన్నింటినీ మద్యం సేవించే టప్పుడు అస్సలు తీసుకోవద్దు.