సాధారణంగా గ్రహాల మార్పుల వల్ల కొన్నిసార్లు శని ప్రభావం మనపై పడుతుంది.ఈ విధంగా శని ప్రభావం మనపై ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి పనులు ముందుకు సాగవు.
మనం చేపట్టే ప్రతి పనిలోనూ అశుభం కలగడమే కాకుండా నష్టాలను తీసుకొస్తుంది.అందుకోసమే ప్రతి ఒక్కరు శని దోష పరిహారాలు పాటిస్తూ శని ప్రభావం నుంచి విముక్తి పొందుతారు.
మరి శని ప్రభావం మనపై ఉండకుండా ఉండాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలి అనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం…
ముఖ్యంగా శనిగ్రహ ప్రభావ దోషం మనపై లేకుండా ఉండాలంటే శుభ్రంగా తలస్నానం చేసి ఒక గిన్నెలో నువ్వుల నూనె తీసుకొని ఆ నూనెలో మన మొహాన్ని చూసుకోవాలి.అనంతరం ఆ నూనెను ఇతరులకు దానం చేయాలి.
ఇలా నూనెతో ఈ పరిహారం చేయడం వల్ల శని ప్రభావ దోషం తొలగిపోతుంది.అలాగే శని దోషం తొలగి పోవాలంటే శనీశ్వరుడికి నీలిరంగు పుష్పాలతో పూజ చేయాలి.
శనికి పూజ చేసే సమయంలో ఎప్పుడూ కూడా శనీశ్వరుడి విగ్రహానికి ఎదురుగా నిలబడి పూజ చేయకూడదు.
పురాణాల ప్రకారం శని ప్రభావ దోషం తొలగిపోవాలంటే కేవలం శనీశ్వరుడికి మాత్రమే కాకుండా, ఏ విధమైనటువంటి శని ప్రభావం లేని ఆంజనేయ స్వామి వారిని కూడా పూజించడం వల్ల శని ప్రభావ దోషం తొలగిపోతుంది.శని దోషం నుంచి విముక్తి పొందాలంటే ఏదైనా ఆలయానికి లేదా రావిచెట్టు కింద ప్రతి రోజు నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వల్ల ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా సంతోషంగా ఉంటారు.