ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కు క్రెస్తవ సంఘాల నుంచి అనుకోని ఎదురుదెబ్బ తగిలింది.ఈ మేరకు ఆయనకు హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి.
ఈ మేరకు క్రిస్టియన్ పొలిటికల్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నేతలు ఆయనకు ఝలక్ లు ఇచ్చారు.ఆయా వేదికలలో క్రైస్తవ ప్రతినిధిగా కేఏ పాల్ పాల్లొనరాదని ఈ ఫ్రంట్ కన్వీనర్ జెరుసెలం మత్తయ్య డిమాండ్ చేశారు.
క్రైస్తవుల ఓట్లను రాజకీయ పార్టీలకు తాకట్టు పెట్టాలనే చేయవద్దని, అలా చేస్తే వాటిని తాము అడ్డుకుంటామని ఆయన అన్నారు.
కేఏ పాల్ రాజకీయ రంగంలో గానీ, క్రైస్తవ మత ప్రభోదకుడిగా గానీ మాత్రమే ఉండాలని తెలియ చేశారు.క్రైస్తవ మత గురువుగా ఉన్నప్పుడు ప్రధాన మంత్రులు, ముఖ్య మంత్రులు, సినీ, వ్యాపార ప్రముఖులు వచ్చి నమస్కరించారంటే కేవలం దేవుడు ఇచ్చిన శక్తి వల్ల మాత్రమేనని, వాటిని చులకనగా మాట్లాడవద్దని మత్తయ్య పాల్ కి సూచించారు.