దాదాపు పది సంవత్సరాల తర్వాత డీఎంకే పార్టీ అధికారంలోకి రావడంతో తమిళనాడులో సరికొత్త రాజకీయ వాతావరణం ఏర్పడింది.ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో డి.
ఎం.కె కూటమి భారీ మెజార్టీతో గెలవడం తో నేడు తమిళనాడు 14వ రాష్ట్ర ముఖ్యమంత్రిగా స్టాలిన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.ఈ సందర్భంగా తన తో పాటు క్యాబినెట్ మంత్రులతో 34 మంది చేత ప్రమాణం చేయించనున్నారు.
తొలి మంత్రివర్గంలో ఇద్దరు మహిళలకు మరియు ఇద్దరు మైనార్టీలకు చోటుకల్పించారు.
హోం శాఖను తన వద్దే ఉంచుకుని.ఆర్థిక శాఖను పిడిఆర్ పలని వేల్ త్యాగరాజన్ కు… ఆరోగ్య శాఖలో సైదా పేట ఎమ్మెల్యే సుబ్రహ్మణ్యంకు కట్టబెట్టారు.
అయితే ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలో వైరస్ తీవ్రత అధికంగా ఉండటంతో.తన ప్రమాణ స్వీకార మహోత్సవానికి డీఎంకే పార్టీకి చెందిన కార్యకర్తలు నాయకులు ఎవరు హడావిడి చేయకూడదని రాకూడదని తెలిపారు.
మీ అందరి ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉండటం వల్ల ఈ నిర్ణయం తీసుకోవటం జరిగిందని అర్థం చేసుకోవాలని స్టాలిన్ సూచించారు.
.