తాజాగా దేశంలో జరిగిన 5 రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో భాగంగా ఎట్టకేలకు రాజకీయ నాయకుల భవిష్యత్తు తేలింది.ఇందులో భాగంగానే అందరూ ఊహించిన విధంగానే తమిళనాడు ముఖ్యమంత్రిగా స్టాలిన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు.
తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా డిఎంకె కూటమి ప్రత్యర్థి పార్టీ పై భారీ విజయాన్ని నమోదు చేసిన సంగతి అందరికీ తెలిసిందే.డి.
ఎం.కె కూటమి చేతిలో భారీగా ఓడిపోయిన అన్నాడిఎంకె అభ్యర్థి, తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పళనిస్వామి తాజాగా ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా పత్రాన్ని రాష్ట్ర గవర్నర్ బన్వర్ లాల్ పురోహితులకు అందజేశారు.
ఇకపోతే తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన డిఎంకె పార్టీ అధినేత స్టాలిన్ తన తండ్రి సమాధి ఉన్న మెరీనా బీచ్ లో తన తండ్రికి ఘన నివాళులు అర్పించాడు.అయితే ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో భాగంగా తన ప్రమాణస్వీకారోత్సవం చాలా నిరాడంబరంగా.అతి తక్కువ మంది మధ్యలో నిర్వహించాలని తాను నిర్ణయం తీసుకున్నట్లుగా తెలియజేశారు.234 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగగా అందులో డిఎంకె పార్టీ 152 స్థానాలలో గెలిచి అఖండ విజయాన్ని చేజిక్కించుకుంది.
ఇకపోతే తమిళనాడు ముఖ్యమంత్రిగా స్టాలిన్ మే 7న ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.వరుసగా తమిళనాడు రాష్ట్రంలో మూడోసారి అధికారంలోకి రావాలని భావించిన అన్నాడీఎంకే పార్టీ పై ప్రజలు సు,సుముఖత చూపించకపోవడంతో డిఎంకె కూటమి కి భారీ విజయాన్ని అందుకుంది.జయలలిత, కరుణానిధి ఇద్దరు మరణించిన తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లో డీఎంకే అధికారంలోకి రావడంతో ఇప్పుడు అందరి దృష్టి స్టాలిన్ పై కేంద్రీకృతమైంది.రాబోయే కాలంలో తమిళనాడులో డీఎంకే అధినేత స్టాలిన్ ఏ విధంగా ముందుండి నడిపిస్తారో అని.