ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఒకటి అనుకుంటే మరొకటి అవుతోంది.ఏపీలో రానున్న ఎన్నికల్లో చక్రం తిప్పాలని అనుకున్నా వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదు.
తనతో కలిసి వస్తారని అనుకున్న నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడి వెళ్లిపోవడంతో బాబుకి దిక్కుతోచని పరిస్థితి ఎదురవుతోంది.ఇప్పటికే ఎంతో మంది నేతలు తమకి టిక్కెట్లు రాలేదని తీవ్రమైన అసంతృప్తితో ఉంటూ పార్టీ మారిపోతామని, హెచ్చరికలు జారీ చేస్తున్న సందర్భాలు అనేకం ఉన్నాయి.
అయితే తాజాగా కడప జిల్లాకి చెందిన ఓ కీలక నేత బాబు తో సంప్రదింపులు జరిపి దాదాపు పార్టీలో చేరడం డిసైడ్ అయ్యిపోయిన తరుణంలో ఒక్క సారిగా సదరు నేత యూటర్న్ తీసుకోవడంతో బాబు కి దిమ్మతిరిగిపోయిందట.కడప జిల్లాకి చెందిన మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి ని తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించి మైదుకూరు నుంచీ పోటీ చేయించాలని ప్లాన్ చేశారు బాబు .అందుకు తగ్గ ఏర్పాట్లు అన్ని పూర్తి చేశారు కూడా.అంతేకాదు ఆ స్థానం నుంచీ టిక్కెట్టు ఆశిస్తున్న పుట్టా సుధాకర్ ని బిజ్జగించి మరీ ఆ టిక్కెట్టు ని డీఎల్ కి ఖారారు చేసేశారట.
డీఎల్ అభ్యర్ధిత్వాన్ని ఒకే చేస్తూ కడప నేతలు ఆదినారాయణ రెడ్డి మద్దతు పలికారు.ఇక్కడి వరకూ బాగానే ఉందనుకున్న సమయంలో ఒక్క సారిగా…
డీఎల్ బాబు కి షాక్ ఇస్తూ ఓ ప్రకటన చేశారు.
మైదుకూరు లో తన పార్టీ కార్యకర్తలతో సమావేశం అయ్యి
తను ఎటువంటి పార్టీలో చేరడం లేదని, టీడీపీలో చేరే ప్రశక్తిలేదని తేల్చి చెప్పారు.అంతేకాదు మరొక అడుగు ముందుకు వేసి టీడీపీ అంతా అవినీతి పుట్ట అంటూ కామెంట్స్ చేశారు.
టీడీపీ ని భూస్థాపితం చేయడమే లక్ష్యమని ప్రకటించారు.అంతేకాదు వైసీపీని కూడా వీర లెవిల్ లో తిట్టిపోశారు.
తాను వైసీపీలో కూడా చేరానని స్పష్టం చేశారు.
ఇదిలాఉంటే డీఎల్ ప్రధాన ప్రతిపక్ష , అధికార పార్టీలో చేరకుండా ఆ రెండు పార్టీలని భూస్థాపితం చేస్తానని ప్రకటించడం వెనుక వేరే కారణం ఉందని, త్వరలో ఆయన జనసేన పార్టీలో చేరడానికి లైన్ క్లియర్ చేసుకున్నారని టాక్ వినిపిస్తోంది.అందుకే ఆయన టీడీపీలోకి వెళ్ళాల్సిన సమయంలో యూటర్న్ తీసుకుని జనసేనలోకి జంప్ చేసే ప్రయత్నాలలో ఉన్నారని అంటున్నారు.డీఎల్ జనసేన లోకి వెళ్తారా లేదా అనే విషయం పక్కన పెడితే టీడీపీలోకి వెళ్తారని దాదాపు ఖరారు అయిన సమయంలో చివరి నిమిషంలో ఇలా బాబు కి షాక్ ఇస్తూ తీసుకున్న నిర్ణయం మాత్రం ఏపీలో హాట్ టాపిక్ అవుతోంది
.