ఆంధ్ర ప్రదేశ్ లో మద్య నిషేధం దిశగా వైసీపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది.అంచలంచలుగా మద్య నిషేధాన్ని అమలు చేసే విధంగా జగన్ కసరత్తు చేస్తున్నారు.
అందులో భాగంగానే ప్రైవేటు మద్యం షాపులను పూర్తిగా రద్దు చేసి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మద్యం షాపులను నడిపిస్తున్నారు.ఏపీలో ఈ ఫార్ములా సక్సెస్ అవుతుండడంతో పాటు జగన్ ప్రభుత్వానికి మహిళల నుంచి ఆదరణ పెరగడం గమనించిన బిజెపి తెలంగాణలో తమ పార్టీ బలపడేందుకు మద్య ఉద్యమ నిషేధాన్ని తెరమీదకు తీసుకు వచ్చింది.
తెలంగాణ బిజెపి అధ్యక్ష పదవిని ఆశిస్తున్న మాజీ మంత్రి డీకే అరుణ గురువారం ఈ దీక్ష మొదలుపెట్టారు.శుక్రవారం కూడా ఈ దీక్షను కొనసాగించబోతున్నారు.
రెండు రోజుల పాటు హైదరాబాదులో నిరాహార దీక్ష సాగుతుంది.ఈ దీక్షను తెలంగాణ బిజెపి అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ప్రారంభించారు.మద్యనిషేధ ఉద్యమం ద్వారా మెల్లి మెల్లిగా ప్రజల్లో బలం పెంచుకుని ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగేలా చేయాలని తెలంగాణ బిజెపి పావులు కదుపుతోంది.