తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు అధికార భయం పట్టుకుందని, తన ముఖ్యమంత్రి పదవి ఊడి పోతుందనే భయంతో పాలన కొనసాగిస్తున్నాడంటూ కాంగ్రెస్ మాజీ మంత్రి డికె అరుణ అన్నారు.పదవి పోతుందనే భయంతోనే వాస్తు మార్పులు అంటూ కోట్లకు కోట్లు ఖర్చు చేస్తున్నాడని ఎద్దేవా చేసింది.
కేసీఆర్కు వెన్ను పోటు భయం ఉందని, తనను ఎవరు వెన్ను పోటు పొడిచి అధికారాన్ని లాక్కుంటారో అంటూ ఎప్పుడు కూడా ఆందోళనలో ఉంటున్నాడని డికె అరుణ చెప్పుకొచ్చారు.
తన స్వార్థ ప్రయోజనాల కోసం తన నమ్మకాల కోసం కోట్లు పెట్టి వాస్తు మార్పిడులు అంటూ చేయిస్తున్నాడని ఈ సందర్బంగా అరుణ పేర్కొంది.
ప్రతిపక్షాలతో కనీసం కూడా సంప్రదించకుండా ఏకంగా సచివాలయం మార్చాలనే నిర్ణయాన్ని ఎలా తీసుకోగలిగారు అంటూ ఈమె ప్రశ్నించారు.అంత పెద్ద పని తలపెట్టినప్పుడు రాష్ట్రంలోని ఇతర పార్టీల అభిప్రాయాలను తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈమె చెప్పుకొచ్చింది.
అభివృద్దిని, ప్రజల శ్రేయస్సును పక్కకు పెట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలా చేయడం మంచిది కాదని, ఆయనకు ప్రజలు తప్పకుండా బుద్ది చెప్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది.