తెలంగాణలో బీజేపీ, టీయార్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం నిత్య కురుక్షేత్రంగా మారింది.అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న బీజేపి, పదవులను కాపాడుకుని మరో పదేళ్ల పాటు పాలన చేయాలని గులాభి బాసు వీరి మధ్య నలిగిపోతున్న నేతలు, ప్రజలతో తెలంగాణ భాసిల్లుతుందట.
ఈ క్రమంలో ఒకరి పై ఒకరు చేసుకుంటున్న విమర్శలు కొత్తేమి కాదు.ఇలా రోజుకోసారి అయినా ఈ రెండు పార్టీల్లు ఆరోపణలు చేసుకోందే ఊరుకోవు.
ఇకపోతే తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఫైర్ అయ్యారు.గతంలో కేసీఆర్ జూరాల వద్ద కాలు అడ్డం పెట్టి ఏపీ అక్రమ ప్రాజెక్టులకు నీళ్లు వెల్లకుండా ఆపుతానని డబ్బలు కొట్టారు.
కానీ ప్రస్తుత పరిస్దితుల్లో ఏపీ ప్రభుత్వం ఆర్డీఎస్ కుడి కాలువతో పాటు, ఇతర ప్రాజెక్టులను చేపడుతుంటే కేసీఆర్ సోయి లేకుండా ఫాం హౌజ్లో ఉన్నారని దుయ్యబట్టారు.
ఇదే సమయంలో సభలో లేని వ్యక్తిపై ఆరోపణలు చేయకూడదనే ఇంగితం కూడా హరీశ్ కు లేదని మండిపడ్డారు.
రాష్ట్రంలో అడ్డగోలు అవినీతికి పాల్పడుతూ జనాలను మభ్యపెడుతున్నారని, ఏదో ఒకరోజు ఆ ప్రజలే మిమ్మల్ని పేడతో కొడతారని విమర్శించారు.