పెళ్లి వేడుకలో వధూవరుల కంటే కూడా వారి బంధువుల హడావుడి ఎక్కువగా ఉంటుంది.ఇక పల్లెటూళ్లలో పెళ్లిల్లు చాలా గ్రాండ్గా చేసేందుకు ప్రయత్నిస్తుంటారు.
ఇదే క్రమంలో తమవారి పెళ్లి గ్రాండ్గా ఉండాలని అమ్మాయి తరఫు వారితో అబ్బాయి తరఫు వారు గొడవకు దిగారు.
సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలోని తొగర్రాయిలో వివాహం అనంతరం బారాత్ సమయంలో డీజే పెట్టాల్సిందిగా అబ్బాయి తరఫు వారు అమ్మాయి తరఫు వారిని కోరగా వారు ససేమిరా అన్నారు.
దీంతో కోపంతో ఊగిపోయిన బంధువులు ఆడమగ తేడా లేకుండా ఒకరిని ఒకరు కొట్టుకున్నారు.గొడవ ముదరడంతో పెళ్లికి వచ్చిన బంధువుల అందరూ ఈ గొడవలో తమ ప్రతాపం చూపించారు.
ఒకరినొకరు ఇష్టారీతిలో పిడిగుద్దులతో కొట్టుకున్నారు.
ఈ దాడిలో ఇరువర్గాల బంధువులు కర్రలతో, కుర్చీలతో కొట్టుకున్నారు.
ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి.కాగా అక్కడే ఉన్న కొందరు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఇప్పుడు అది వైరల్గా మారింది.
ఇలా పెళ్లిలో డీజే కోసం కొట్టుకోవడం ఏమిటో అను పలువురు నవ్వుకుంటున్నారు.