మాస్ మహారాజ్ రవితేజ బ్రేక్ లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు.సినిమా సినిమాకి గతంలో కొంత గ్యాప్ ఇచ్చేవాడు.
అయితే క్రాక్ సినిమా రిలీజ్ కాకుండా రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడీ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసేశాడు.ఇక ఈ ఏడాది ఆరంభంలో క్రాక్ తో సాలిడ్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న రవితేజ ఇప్పుడు ఖిలాడీ సినిమాని రిలీజ్ కి రెడీ చేశాడు.
ఇదిలా ఇప్పుడు శరత్ మండవ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.శరత్ మండవ ఇది వరకు తెలుగులో ఆర్పీ పట్నాయక్ తులసీదళం, బ్రోకర్ సినిమాలకి సినిమాటోగ్రాఫర్ గా చేశాడు.
అలాగే తమిళ్ లో బిల్లా 2 సినిమాకి కథ, స్క్రీన్ ప్లే అందించారు.అలాగే తమిళ్ లో బాబీ సింహాతో కో2 అనే మూవీ చేశాడు.
ఈ సినిమా హిట్ అయ్యింది.
దీంతో తెలుగులో మొదటి సినిమాని ఏకంగా రవితేజతో చేసే ఛాన్స్ ని ఈ దర్శకుడు సొంతం చేసుకోవడం విశేషం.
ఇదిలా ఉంటే ఉగాది సందర్భంగా ఈ సినిమాకి సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా జరిగిపోయాయి.వచ్చే నెలలో సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉందని తెలుస్తుంది.
ఈ సినిమాలో హీరోయిన్ మజిలీ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయిన దివ్యాన్షా కౌశిక్ ని హీరోయిన్ గా ఫైనల్ చేశారు.ఈ భామకి తెలుగులో ఇది రెండో సినిమా కావడం విశేషం.
ఇదిలా ఉంటే రవితేజ ఇప్పటికే త్రినాధ్ రావు నక్కిన దర్శకత్వంలో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.ఖిలాడీ సినిమా తర్వాత అదే సెట్స్ పైకి వెళ్తుందని అందరూ భావించారు.
అయితే ఇప్పుడు సడెన్ గా రవితేజ ఈ కొత్త సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్ళడంతో త్రినాధ్ రావు సినిమా మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది.
.