గత కొంత కాలం నుంచి బాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తున్న
బిగ్బాస్ ఓటీటీ షో
గ్రాండ్గా ముగిసింది.ఓటీటీప్రసారం అవుతూ ఎంతో ప్రేక్షకాదరణ సంపాదించుకున్న ఈ కార్యక్రమానికి కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
ఈ క్రమంలోనే బిగ్బాస్ ఓటీటీ గ్రాండ్ ఫినాలే శనివారం(సెప్టెంబర్ 18)న ఎంతో అట్టహాసంగా జరిగింది.ఈ క్రమంలోనే ఈ షోకి టైటిల్ రేసులో దివ్యతో పాటు, నిశాంత్ భట్ టైటిల్ రేసులో ఉన్నారు.
ఈ క్రమంలోనే శనివారం జరిగిన గ్రాండ్ ఫినాలేలో దివ్య విజేతగా.నిశాంత్ రన్నర్ గా నిలిచారు.
గ్రాండ్ ఫినాలే లో దివ్య బిగ్ బాస్ ట్రోఫీని అందుకోవడమే కాకుండా 25 లక్షల ప్రైజ్ మనీను కూడా గెలుచుకున్నారు.
ఇక హిందీ బిగ్ బాస్ విషయానికి వస్తే.ఇప్పటికే 14 సీజన్లను పూర్తిచేసుకున్న అక్టోబర్ నెలలో 15వ సీజన్ ను ప్రారంభించడానికి బిగ్బాస్ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అయితే బిగ్ బాస్ నాలుగవ సీజన్ నుంచి 14 వరకు హోస్ట్ గా బాలీవుడ్ స్టార్ హీరో కండలవీరుడు సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.15 వ సీజన్ కి కూడా సల్మాన్ వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.అయితే ఈ సీజన్ రావడానికి ముందుగానే ఈ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా బిగ్బాస్ ఓటీటీని ప్రవేశపెట్టారు.దీనికి స్టే కనెక్టెడ్ అన్న ట్యాగ్ లైన్ పెట్టారు.
ఈ షో కేవలం ఓటీటీ ప్లాట్ఫామ్ వూట్లోనే ఏడు వారాల పాటు ప్రసారమయ్యేన ఈ కార్యక్రమాన్ని మినీ బిగ్ బాస్ గా చెప్పుకోవచ్చు.
మరి ఇందులో విజేతగా నిలిచిన దివ్యను బిగ్ బాస్ 15 కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇవ్వబోతోందా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.ఏదిఏమైనప్పటికీ ఏడు వారాల పాటు ఎంతో రసవత్తరంగా కొనసాగిన ఈ కార్యక్రమంలో దివ్య అద్భుతమైన ప్రదర్శన కనపరిచి టైటిల్ గెలుచుకోవడం విశేషం.ఇక దివ్య వ్యక్తిగత విషయానికి వస్తే నటిగా, డాన్సర్ గా MTV స్ప్లిట్స్ విల్లాపేరు సంపాదించుకున్న ఈమె బిగ్ బాస్ సీజన్ 10 లో పాల్గొని రన్నర్ గా నిలిచారు.
ఇలా సోషల్ మీడియాలో ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న ఈమె బిగ్ బాస్ 15 లోకి ఎంట్రీ ఇస్తుందో లేదో వేచి చూడాలి.