తాజాగా బిగ్ బాస్ హౌస్ 4 నుంచి ఊహించని పరిణామం ఎదురైంది.ఈ మధ్యకాలంలో ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకుంటున్న వారిని వరుసపెట్టి ఎలిమినేట్ చేయడం జరుగుతోంది.
నిజానికి ఈ ప్రక్రియ బిగ్ బాస్ హౌస్ లో దేవి నాగవల్లి ఎలిమినేషన్ నుండి మొదలైందని చెప్పవచ్చు.దేవి ఎలిమినేషన్ జరిగిన తర్వాత నుండి బిగ్ బాస్ ఎలిమినేషన్ ప్రక్రియ పై టెలివిజన్ ప్రియులు, అలాగే బిగ్ బాస్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున మండి పడుతున్నారు.
బిగ్ బాస్ షో పూర్తిగా స్క్రిప్ట్ ఓరియెంటెడ్ అయిపోయింది అంటూ పెద్ద ఎత్తున కామెంట్ల వర్షం కురుస్తోంది.ఆపై బిగ్ బాస్ షో లో గంగవ్వ కూడా తనకు తానే బయటికి వచ్చినా, ఆ తర్వాత రోజే ఇంట్లో నుంచి స్వాతి దీక్షిత్ ఎలిమినేట్ అవ్వడం కూడా చాలా షాకింగ్ గా అనిపించింది. ఆ తర్వాత సుజాత ఎలిమినేషన్ ప్రక్రియ ఓ రకంగా సజావుగానే సాగిన ఆ తర్వాత మళ్లీ కుమార్ సాయి దగ్గరికి వచ్చేసరికి మళ్లీ సీన్ రివర్స్ అయ్యింది.ఇప్పుడు అదే కొనసాగింపుగా మళ్లీ దివి విషయంలో కూడా జరిగింది.
ఇకపోతే కుమార్ సాయి ని ఎలిమినేట్ చేయడానికి గల కారణం మోనాల్ ను సేవ్ చేయడానికి అంటూ సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరిగింది.అయితే ఈసారి కూడా దివి విషయంలో అదే జరిగింది అంటూ సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు.
నిజానికి బిగ్ బాస్ హౌస్ లో మోనాల్ కంటే దివి స్ట్రాంగ్ కంటెస్టెంట్.అయినా సరే మోనాల్ ను ఇంట్లోనే ఉంచి దివి ని బయటికి పంపేస్తున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది.
గత వారం దివి ఎలిమినేట్ అవుతుందని కలలో కూడా ఒక్కరు కూడా ఊహించి ఉండరు.కచ్చితంగా ఈ సారి మాత్రం మోనాల్ వెళ్ళిపోతుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
అయితే చివరికి బిగ్ బాస్ హౌస్ లో అఖిల్ తో ప్రేమాయణం కొనసాగిస్తున్న ఒకే ఒక్క నేపథ్యంలో అవసరం లేని కారణంతో ఆమెను సేవ్ చేస్తున్నారని పైగా బోల్డ్ గా ఉంటుందని అందుకే ఆమెను అక్కడ ఉంచి మిగతా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ను బయటికి పంపిస్తున్నారని బిగ్ బాస్ పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.తాజాగా బిగ్ బాస్ హౌస్ నుండి దివి ఎలిమినేషన్ పై మాత్రం భారీ ఎత్తున విమర్శలు వస్తున్నాయి.
బిగ్ బాస్ నిర్వాహకులు ప్రజలు వేసిన ఓట్లతో నిర్ణయించి ఎలిమినేట్ చేస్తున్నారో… లేకపోతే ప్రజల నిర్ణయాన్ని పక్కన పెట్టి వారికి కావాల్సిన విధంగా ఎలిమినేట్ చేసుకుంటూ పోతున్నారో అర్థం అవ్వట్లేదు బిగ్ బాస్ చూస్తున్న ప్రేక్షకులకి.