ఇటీవల ప్రారంభమైన తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ నాల్గువ సీజన్ రంజుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.మొదటి వారం నీరసంగా ఉన్న ఇంటి సభ్యులు.
రెండు, మూడు వారల్లో కాస్త ఎనర్జీ పెంచి బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ట్రై చేస్తున్నారు.ఇక ఈ వారం లగ్జరీ బడ్జెట్ కోసం ఉక్కు హృదయం అనే టాస్క్ని ఇంటి సభ్యులకు బిగ్ బాస్ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఈ టాస్క్లో ఇంటి సభ్యులు రోబో- మనుషులుగా విడిపోయి పోటీ పడ్డారు.
అయితే చివరకు ఎత్తుకు పై ఎత్తులు, ఏడుపులు, అరుపులు, కొట్లాటలు తర్వాత గురువారం రోబోలను విజయం వరించింది.
దీంతో తీవ్రంగా కడుపులు మాడ్చుకుని మరీ శ్రమించిన మనుషుల టీమ్ తెగ ఫీల్ అయిపోయారు.ఇక ఉక్కు హృదయం టాస్క్లో బెస్ట్ పెర్ఫామర్స్గా అభిజిత్, హారిక, గంగవ్వ, అవినాష్ ఎంపిక అయ్యారు.
దీంతో ఈ నలుగురిని బిగ్ బాస్ కెప్టెన్సీ కోసం జరిగే పోటీకి అభ్యర్థులుగా ప్రకటించారు. మరోవైపు ఓడిపోయిన మనుషుల టీమ్ నుంచి వరస్ట్ పెర్ఫామర్గా నోయల్ ఎంపిక అవ్వడంతో.
బిగ్ బాస్ అతడిని జైలుకు పంపించాడు.అంతేకాకుండా, జైలులో ఉన్న నోయల్కి టీ, కాఫీలతో పాటు ఎటువంటి ఆహారం ఇవ్వకూడదని.
కేవలం రాగిజావ, ఏదో ఒక పండు మాత్రమే ఇవ్వాలని ఇంటి సభ్యులను బిగ్ బాస్ హెచ్చరించారు.
ఈ క్రమంలోనే నోయల్ జైల్లోకి వెళ్లడంతో.
దివి ఏడ్చేసింది.తన వల్లే ఈ టాస్క్ ఓడిపోయామని.
కిడ్నాప్ అయ్యింది నేనే కదా.అనవసరంగా నోయల్ జైలుకి వెళ్లాడని దివి తెగ ఫీల్ అయిపోయింది.ఇక ఆమెను ఓదార్చడం మిగిలిన సభ్యుల వంతు అయింది.మరోవైపు జైల్కు వెళ్లిన నోయల్.బంధీని కాదు నేను.సంధించి వస్తాను.
చెరసాలలో వేసినా చరిత్ర రాస్తాను అంటూ ర్యాప్ పాడి ఇంటి సభ్యులను ఖుషీ చేశాడు.