ఏపీలో జేసీ బ్రదర్స్ అంటే తెలియని వారే లేరేమో.అంతలా వీరు రాజకీయాల్లో మంచి ముద్ర వేశారు.
ఇక ఒకప్పుడు వెలుగు వెలిగిన వీరు ఇప్పుడు దారుణ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.ఇక జేసీ దివాకర్ రెడ్డి పరిస్థితి అయితే మరీ దారుణంగా తయారైంది.
ఆయన ఏదో అనుకుంటో ఇంకేదో అవుతోంది.ఆయన గతంలో కూడా తెలంగాణకు వచ్చి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కలిసిన సంగతి అందరికీ తెలిసిందే.
కాగా ఇప్పుడు మరోసారి ఆయన తెలంగాణ అసెంబ్లీ సమవేశాలు జరుగుతున్న క్రమంలో ఇక్కడకు వచ్చారు.
ఇక వస్తూనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కలిసేందుకు వెళ్లారు.
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చాంబర్లోకి వెళ్లగానే అక్కడే ఉన్న విక్రమార్క, జీవన్రెడ్డి, జగ్గారెడ్డిలను కలుసుకున్నారు.అయితే దివాకర్ రెడ్డికి గట్టి క్లాస్ పీకారు ఎమ్మెల్సీ టీ.జీవన్ రెడ్డి.ఎందుకంటే దివాకర్రెడ్డి ప్రతిసారి ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం వల్ల కాంగ్రెస్కు నష్టం జరుగుతోందని చెప్పారు.
ఏదైనా ఉంటే బయట మాట్లాడుకోవాలని ఇలా సీఎల్పీ ఆఫీసులో మాట్లాడవద్దని చెప్పారు.అయితే వీరిద్దరూ కూడాఒకప్పుడు కాంగ్రెస్ లో చక్రం తిప్పిన వారే.
కానీ జేసీ టీడీపీలో చేరడంతో అప్పటి నుంచే ఆయనకు కాంగ్రెస్ నేతలు దూరంగా ఉంటున్నారు.కానీ తెలంగాణ కాంగ్రెస్ నేతలను మాత్రం ఆయన తరచూ కలుస్తూనే ఉన్నారు.ఇప్పుడు మరోసారి అలాగే చేశారు.ఇక ఆయన గతంలో మీడియా కాంగ్రెస్ గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు అందరినీ ఇబ్బంది పెట్టాయనే చెప్పాలి.దాన్ని దృష్టిలో ఉంచుకునే జీవన్రెడ్డి అలాంటి మాటలు అన్నారని తెలుస్తోంది.ఇక ఆయన మాటలకు జేసీ షాకయ్యారు.
దీంతో అక్కడి నుంచి బయటకు వచ్చేశారు.ఇక జీవన్ రెడ్డికి ఈ విషయంలో సారీ కూడా చెప్పడం విశేషం.
ఆయన ఏదో అనుకుని వస్తే చివరకు ఇంకేదో అయిందన్నమాట.