సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్ సద్దలచెరువు వద్ద నిర్వహించే గణేష్ నిమజ్జనం ప్రదేశాన్ని బుధవారం జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ పరిశీలించారు.నిమజ్జనానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలని,లైటింగ్ ఏర్పాటు చేయడం, భారీకెడ్స్,క్రేన్ల వంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ గణేష్ నిమజ్జనం కార్యక్రమాన్ని పురస్కరించుకొని సూర్యాపేట పట్టణ మినీ ట్యాంక్ బండ్ వద్ద,జిల్లాలో కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశామని తెలిపారు.జిల్లాలో గణేష్ శోభాయాత్రను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని,ఉత్సవ కమిటీలు, భక్తులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని కోరారు.
శోభాయాత్రలో ఉపయోగించే వాహనాలు కండిషన్ లో ఉండాలని,అన్ని అనుమతి పత్రాలు కలిగుండాలని, పిల్లలను ఎవరిని శోభాయాత్ర వాహనంపై ఎక్కించరాదని,ప్రతీ ఒక్కరూ తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సూర్యాపేట డిఎస్పి నాగభూషణం,ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్,ఎస్సైలు శ్రీనివాస్,సాయిరాం,సిబ్బంది పాల్గొన్నారు.