నిరాశ్రయులకు దుప్పట్లు పంపిణీ చేసిన నాట్స్ టెంపాబే: డిసెంబర్ 26: నిరాశ్రయులకు దుప్పట్లు పంపిణీ చేసిన నాట్స్
టెంపాబే: డిసెంబర్ 26: భాషే రమ్యం.సేవే గమ్యం అనే విధానంతో ముందుకు వెళుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్.
తాజాగా నిరాశ్రయులకు దుప్పట్లు పంపిణీ చేసింది.నాట్స్ టెంపాబే విభాగం, హోమ్లెస్ ఆఫ్ పస్కో కౌంటీతో కలిసి టెంపాబేలో చలికి తీవ్ర ఇబ్బందులు పడుతున్న నిరాశ్రయులకు ఈ దుప్పట్లను పంపిణీ చేసింది.
డాక్టర్ నీరజ జాస్తీ ఆమె స్నేహితులు ముఖ్యంగా దుప్పట్లకు అందించేందుకు ప్రధాన దాతలుగా వ్యవహరించారు.నాట్స్ నాయకులు శ్రీనివాస్ గుత్తికొండ, ప్రశాంత్ పిన్నమనేని, శ్రీనివాస్ మల్లాది, సుధీర్ మిక్కిలినేని, సురేశ్ బొజ్జ, సుమంత్ రామినేని తదితరులు ఈ దుప్పట్ల పంపిణీలో కీలక పాత్ర పోషించారు.డాక్టర్ నీరజ జాస్తి మరియు ఆమె స్నేహితులు సేవాభావంతో ముందుకొచ్చి దుప్పట్ల పంపిణీ కావాల్సిన ఆర్ధిక సాయాన్ని చేసినందుకు నాట్స్ వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది.