యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఅర్ 2001 సంవత్సరంలో విడుదలైన నిన్ను చూడాలని సినిమాతో కెరీర్ ను మొదలుపెడితే రామ్ చరణ్ 2007 సంవత్సరంలో విడుదలైన చిరుత సినిమాతో హీరోగా కెరీర్ ను మొదలుపెట్టారు.తారక్ కెరీర్ తొలినాళ్లలో ఎక్కువగా మాస్ రోల్స్ కు ప్రాధాన్యత ఇచ్చి మాస్ హీరోగా పాపులారిటీని సొంతం చేసుకోగా చరణ్ మాత్రం మాస్ రోల్స్ లో నటిస్తూనే క్లాస్, ఇతర జానర్ల కథాంశాలకు కూడా ప్రాధాన్యత ఇచ్చారు.
మంచి స్నేహితులైన చరణ్, తారక్ చాలా సందర్భాల్లో కలుస్తూ ఒకరికొకరు ఎన్నో విషయాలను షేర్ చేసుకుంటూ ఉంటారు.ఆర్.ఆర్.ఆర్ సినిమాలో ఈ ఇద్దరు హీరోలు కలిసి అద్భుతంగా నటించి ప్రేక్షకుల మెప్పు పొందడంతో పాటు ప్రేక్షకుల మదిలో తమ స్థానాలను మెరుగుపరుచుకున్నారు.విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్ గా నిలవడంతో పాటు ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంటూ చరిత్రను తిరగరాస్తోంది.
ఈ సినిమాకు దర్శకత్వం వహించిన రాజమౌళికి ఆస్కార్ అవార్డ్ గ్యారంటీ అని ఈ విషయంలో ఎలాంటి అందేహాలు అవసరం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.
అయితే ఆర్.ఆర్.ఆర్ రిలిజ్ సమయంలో చరణ్, తారక్ లలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎవరు అంటూ సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరిగింది.నందమూరి ఫ్యాన్స్ తారక్ ను మ్యాన్ ఆఫ్ మాసెస్ అని పిలవడం కరెక్ట్ అని చెబితే మెగా ఫ్యాన్స్ చరణ్ ను మ్యాన్ ఆఫ్ మాసెస్ అని పిలిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.
సాయితేజ్ సినిమాకు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఇందుకు సంబంధించి ట్వీట్ చేస్తూ సాయితేజ్ తారక్ ను మ్యాన్ ఆఫ్ మాసెస్ అని పేర్కొన్నారు.సాయితేజ్ ఆలా ట్వీట్ చేయడం నచ్చని కొందరు చరణ్ ఫ్యాన్స్ ఆ విషయాన్ని సాయితేజ్ దృష్టికి తీసుకెళ్లగా సాయితేజ్ తన ట్వీట్ ను మార్చేశారు.సాయితేజ్ ట్వీట్ ను మార్చడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫీలయ్యారు.
ట్వీట్ మారడానికి కారణమైన చరణ్ ఫ్యాన్ ను తారక్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు.సాయితేజ్ ట్వీట్ ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ మధ్య గ్యాప్ పెంచడం గమనార్హం.