కాంగ్రెస్‌లో రచ్చకెక్కిన విబేధాలు.. గందరగోళంలో కార్యకర్తలు.. ?

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ క్రమక్రమంగా బలహీనం అవుతున్న విషయం తెలిసిందే.ఇలాంటి విభేదాలతో పార్టీ ప్రతిష్ట మసకబారడమే కాదు తన ఉనికిని కూడా కోల్పోతుంది.

 Disputes In Telangana Congress Party , Rangareddy District, Shadnagar Constituen-TeluguStop.com

ఇలాంటి సమయంలో రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న వర్గపోరు కార్యకర్తలను ఆందోళనకు గురిచేస్తుంది.ఇక్కడి నాయకులైన వీర్లపల్లి శంకర్, కడెంపల్లి శ్రీనివాస్ గౌడ్ వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు బహిరంగంగా విమర్శలకు దిగడం విమర్శలకు తావిస్తుంది.

ఇదిలా ఉండగా కల్వకుర్తి నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేసిన వంశీ చందర్ రెడ్డి ఇప్పుడు షాద్ నగర్ నియోజకవర్గంలోని బీసీ నాయకుల మధ్య చిచ్చుపెడుతూ కాంగ్రెస్ పార్టీని నాశనం చేసేందుకు కుట్రపన్నారంటూ మచ్చ సుధాకర్ రావు ఆరోపించడం సంచలనంగా మారింది.

మొత్తానికి ఇలాంటి ఆరోపనల వల్ల షాద్ నగర్ కాంగ్రెస్‌లో విలువలతో కూడిన నాయకత్వం లోపం కనిపిస్తుంది.

కార్యకర్తలు గందరగోళంకు గురవుతున్నారు.మరి రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ భవితం ప్రశ్నార్ధకంగా మారిపోయిన ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube