భోగాపురం ఎయిర్ పోర్ట్ పర్యావరణ అనుమతులపై దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది.ఈ క్రమంలో అనుమతులు సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ ను ధర్మాసనం కొట్టివేసింది.
పర్యావరణ అనుమతులపై విశాఖకు చెందిన దాట్ల శ్రీదేవి ఈ పిటిషన్ ను దాఖలు చేశారు.ఈ సందర్భంగా భోగాపురం విమానాశ్రయం నిర్మాణాన్ని కేవలం ఒక్క వ్యక్తి వ్యతిరేకిస్తున్నారా అని సీజేఐ ధర్మాసనం ప్రశ్నించింది.
దీనిపై ఒక్క వ్యక్తి కూడా సవాల్ చేయొచ్చని పిటిషనర్ తరపు న్యాయవాది తెలిపారు.ఒకరి వ్యతిరేకత సరిపోతుంది కానీ.
దానికి బలమైన కారణం ఉండాలన్న న్యాయస్థానం పిటిషన్ ను కొట్టివేసింది.