ఏపీ ఎన్నికల కార్యకలాపాలకు ఆటంకం కలిగించారనే అభియోగంపై రాష్ట్ర ఎన్నికల సంఘం జాయింట్ డైరెక్టర్ జీవి సాయి ప్రసాద్ ను ఎస్ ఈ సి నిమ్మగడ్డ రమేశ్ విధుల నుండి తొలగించిన సంగతి తెలిసిందే.పంచాయతీ ఎన్నిక నేపథ్యంలో ఈనెల 9 నుండి ఎవరు కూడా సెలవలు పెట్టవద్దని నిమ్మగడ్డ కోరారు.
కానీ ఆయన చెప్పిన మాట వినకుండా 30 రోజులు లీవ్ కావాలని లేఖ పంపడం అదే విదంగా తోటి ఉద్యోగులను కూడా లీవ్ లు పెట్టాలిసిందిగా ప్రోత్సహించడంతో వారిపై ఆరోపణలు రావడంతో ఆర్టికిల్ 243కే రెడ్ విత్ 324 ప్రకారం ప్రత్యేకమైన అధికారాలు ఉపయోగించి విధుల నుండి తొలగిస్తున్నట్లుగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు.ఆయన ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని విధులు నిర్వహించడానికి వీలు లేదని తెలిపాడు.
జీవి సాయి ప్రసాద్ సస్పెండ్ అయిన మరుసటి రోజునే ఏపీ ఎన్నికల కార్యదర్శి వాణి మోహన్ ను కూడా విధుల నుండి తొలగిస్తున్నట్లుగా రాష్ట్ర ఎన్నికల కమీషనర్ తెలిపాడు.ఇకపై వాణి మోహన్ సేవలు కమీషన్ కార్యాలయంలో అవసరం లేదంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాద్ దాస్ కి లేఖ రాశాడు.మొత్తానికి నిమ్మగడ్డ తీసుకుంటున్న నిర్ణయం చర్చనీయాంశం అయ్యింది.