మెగా హీరో వరుణ్ తేజ్ సరసన లోఫర్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ దిశాపటానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ సినిమా తర్వాత తెలుగు తెరకు పరిచయమైన ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో పాగా వేసింది.
ఇలా బాలీవుడ్ చిత్రాల ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న దిశాపటాని సోషల్ మీడియాలో కూడా ఎంతో చురుకుగా పాల్గొంటారు.ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.
ఇదిలా ఉండగా న్యూ ఇయర్ వేడుకల కోసం ఎంతో మంది సెలబ్రిటీలు వివిధ ప్రాంతాలకు వెళ్లి కొత్త సంవత్సరానికి స్వాగతం పలికిన విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే దిశాపటాని రూమర్డ్ బాయ్ఫ్రెండ్ టైగర్ ష్రాఫ్తో కలిసి నూతన సంవత్సరానికి స్వాగతం పలకడం కోసం మాల్దీవులకు వెళ్లినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఈమె మాల్దీవులకు సంబంధించిన ఫోటోలను షేర్ చేయడంతో ఈ ఫొటోలు కాస్త నెట్టింట్లో వైరల్ గా మారాయి.
మాల్దీవులలో ఈ ముద్దుగుమ్మ ఏకంగా జలకన్యగా మారిపోయింది.పింక్ కలర్ బికినీ ధరించి బీచ్ లో జలకన్య మాదిరిగా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది నెటిజన్లు ఈ ఫోటోలో పై స్పందిస్తూ అచ్చం జలకన్యగా ఉన్నావంటూ కామెంట్లు చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.