టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ రాజమౌళి, ప్రభాస్ సూపర్ హిట్ మూవీ ఛత్రపతిని హిందీలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సినిమాకి సంబందించిన ప్రీప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం జరుగుతుంది.
భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమా కోసం ఇప్పటికే బెల్లంకొండ శ్రీనివాస్ ముంబై వెళ్ళిపోయి అక్కడ రిహార్శల్స్ స్టార్ట్ చేశాడు.మరోవైపు ఈ సినిమాలో హీరోయిన్ గా చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు.
ముందుగా భారీగా రెమ్యునరేషన్ ఇచ్చి స్టార్ హీరోయిన్ ని రంగంలోకి దించాలని భావించారు.అయితే స్టార్ హీరోయిన్స్ ఎవరూ కూడా బెల్లంకొండ శ్రీనివాస్ తో చేయడానికి ఆసక్తి చూపించలేదు.
సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ కూడా చాలా పరిమితంగా పాటలవరకే అన్నట్లు ఉంటుంది.
ఈ నేపధ్యంలో ఈ మధ్యకాలంలో కంటెంట్ బేస్ సినిమాలు చేస్తున్న బాలీవుడ్ భామలు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చిన చేయడానికి ఆసక్తి చూపించలేదు.
ఇదిలా ఉంటే ఫైనల్ గా ఈ సినిమా హీరోయిన్ ని ఖరారు చేసినట్లు తెలుస్తుంది.తెలుగులో లోఫర్ సినిమాలో హీరోయిన్ గా చేసిన అందాల భామ దిశా పటానీని ఈ సినిమాలో హీరోయిన్ గా ఫైనల్ చేశారు.
ఇక ఇందులో నటించడం కోసం ఆమెకి పెద్ద మొత్తంలో ఆఫర్ చేసినట్లు తెలుస్తుంది.హీరో కంటే ఎక్కువ రెమ్యునరేషన్ ని హీరోయిన్ కె ఇస్తున్నారని బిటౌన్ లో టాక్ వినిపిస్తుంది.
త్వరలో ఆమె పేరుని హీరోయిన్ గా అఫీషియల్ ఎనౌన్స్ చేయనున్నట్లు బోగట్టా.ఇక మార్చిలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.