సైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా పుష్ప.ఈ మధ్యనే పుష్ప నుండి విడుదలైన టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
ఇందులో అల్లు అర్జున్ ఎర్ర చందనం స్మగ్లర్ గా నటిస్తున్నాడు.ఈ సినిమాలో పుష్ప రాజ్ గా తగ్గేదే లే అంటూ అల్లు అర్జున్ చెప్పిన మాస్ డైలాగ్ కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు.పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు.సరైన సినిమాతోనే బాలీవుడ్ లోకి అడుగు పెట్టబోతున్నాడని ఇప్పటికే ప్రేక్షకులతో పాటు పలువురు అభిప్రాయ పడుతున్నారు.
ఈ సినిమాలో టాలీవుడ్ టాప్ హీరోయిన్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాలో రష్మిక ఒక గిరిజన యువతిగా నటిస్తున్నట్టు టాక్.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది.పరిస్థితులు చక్కబడితే కానీ ఈ సినిమా షూటింగ్ మళ్ళీ ప్రారంభం అయ్యేలా లేదు.అయితే ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే నిర్మాతలు ప్రకటించారు.మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలో అదిరిపోయే ఐటం సాంగ్ కూడా ఉంటుందని ఇప్పటికే తెలుసు.ఈ సాంగ్ లో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా ఆడిపాడనుందని వార్తలు వచ్చాయి.
కానీ చిత్ర యూనిట్ బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని ను సంప్రదిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.ఈ బ్యూటీ కు తెలుగులో కూడా మంచి గుర్తింపు ఉంది.
అంతేకాదు బాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్.అందుకే ఈ బ్యూటీ ను తీసుకుంటే ఐటం సాంగ్ రేంజ్ పెరుగుతుందని చిత్ర యూనిట్ భావిస్తుంది.