టాలీవుడ్లో దర్శకనిర్మాతలు తెలుగు హీరోయిన్ల కంటే కూడా బాలీవుడ్ బ్యూటీలనే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.దీంతో కొత్త హీరోయిన్లను తీసుకునేటప్పుడు కూడా అక్కడి పాపలనే రికమెండ్ చేస్తారు.
కాగా కొందరు మాత్రం అక్కడి నుండి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోతారు.కానీ కొందరు మెరుపుతీగలా ఇలా వచ్చి అలా వెళతారు.
ఈ కోవలోకే చెందింది బాలీవుడ్ బ్యూటీ దిషా పటానీ.
మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన లోఫర్ చిత్రంలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన దిషా పటానీ ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో మళ్లీ తెలుగులో నటించలేదు.
కానీ అమ్మడికి బాలీవుడ్లో మాత్రం అదిరిపోయే ఆఫర్లు వచ్చి పడుతున్నాయి.అక్కడ ఎంఎస్ ధోనీ చిత్రంతో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చి, టైగర్ ష్రోఫ్తో కలిసి బాఘీ 2 చిత్రంతో బ్లాక్బస్టర్ హిట్ అందుకుంది.
ఇక ఆ సినిమాతో వచ్చిన క్రేజ్తో ఇప్పుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్న రాధే చిత్రంలో నటిస్తోంది.
ఇలా టాలీవుడ్లో ఒక్క సినిమా ఫ్లాప్తో కనబడకుండా పోయిన ఈ బ్యూటీ అక్కడ మాత్రం అదరిపోయే సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు పిచ్చెక్కిస్తోంది.
తన హాట్ అందాలతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది.