ఈ మధ్య కాలంలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నుంచి ఏ మాత్రం పసలేని సినిమాలు ప్రేక్షకుల ముందుకి వస్తున్నాయి.కేవలం తన ఇమేజ్ మీద ఉన్న మార్కెట్ తో అతని సినిమాలకి డబ్బులు వస్తున్నాయి తప్ప కంటెంట్ లో ఎలాంటి విషయం ఉండటం లేదు.
అయితే ఏదో ఒక వివాదాస్పద అంశాన్ని తీసుకొని దానినే తెరపై ఆవిష్కరించి తరువాత ఎవరైనా ఆ సినిమాపై కేసు వేస్తే నేను తీసే సినిమాకి నిజంగా జరిగిన కథకి ఏ మాత్రం సంబంధం లేదని, సమాజంలో జరుగుతున్న పరిణామాలపై రియాక్ట్ అయ్యి ఒక ఊహాజనితమైన కథని సినిమాగా చేస్తున్నా అంటూ న్యాయవ్యవస్థని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తాడు.పవన్ కళ్యాణ్ మీద తీసిన షార్ట్ ఫిలిం విషయంలో గాని, అలాగే చంద్రబాబు మీద తీసిన సినిమా విషయంలో గాని, ప్రణయ్ హత్య కేసుపై మర్డర్ పేరుతో తీసిన సినిమా విషయంలో కూడా ఆర్జీవీ తప్పుడు భాష్యం చెప్పి కోర్టులని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు.
అయితే మర్డర్ సినిమాని రిలీజ్ చేయకూడదని కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.అలాగే హైదరాబాద్ లో జరిగిన దిశా అత్యాచారం, హత్య, నిందితుల ఎన్ కౌంటర్ పైన కూడా అలాగే ఆర్జీవీ దిశా ఎన్ కౌంటర్ టైటిల్తో సినిమా తీసి ట్రైలర్ కూడా వదిలాడు.
అయితే దిశా కేసు న్యాయస్థానం పరిధిలో ఉన్నందున దానిపై తీస్తున్న సినిమా రిలీజ్ కాకుండా ఆపాలని ఆ కేసుని వాదిస్తున్న లాయర్ కోర్టులో పిటీషన్ వేశారు.దీనిపై కూడా ఆర్జీవీ తన స్టైల్ లో వక్రభాష్యం చెప్పాడు.
అసలు హైదరాబాద్ లో జరిగిన ఘటనకి తమ సినిమా కథకి ఎలాంటి సంబంధం లేదని, కేవలం ఈ సినిమా ఒక ఊహాజనిత స్టోరీ అని చెప్పుకొచ్చాడు.మరి దీనిపై న్యాయస్థానం ఎలాంటి తీర్పు చెబుతుంది అనేది చూడాలి.