దిషా నిందితుల ఎన్కౌంటర్ వార్త నిన్న దేశ వ్యాప్తంగా చాలా మంది జనాలకు ఆనందంను కలిగించింది.ఇలాంటి ఎన్కౌంటర్లు జరిగితేనే మళ్లీ జనాల్లో అలాంటి పని చేయాలనే ఆలోచన రాకుండా ఉంటుందని అంటున్నారు.
ఎన్కౌంటర్ విషయమై తెలంగాణ పోలీసులను దేశ వ్యాప్తంగా జనాలు అభినందిస్తున్నారు.రాజకీయ ప్రముఖులు పార్టీలను పక్కన పెట్టి ప్రభుత్వం మరియు పోలీసులను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
ఈ సందర్బంగా అమెరికా అధికారిక రేడియోలో కూడా ఈ విషయమై ఒక వార్తను ప్రసారం చేయడం జరిగింది.
ఇండియాకు చెందిన వార్తను అమెరికా అధికారిక రేడియోలో ప్రసారం చేయడం అంటే మామూలు విషయం కాదు.
జాతీయ స్థాయిలో అత్యంత ప్రభావితమైన వార్తను మాత్రమే ఆ రేడియోలో ప్రసారం చేస్తారు.అలాంటిది దిషా నిందితుల ఎన్కౌంటర్ ఏ స్థాయిలో ట్రెండ్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ విషయం తెలిసిందని చెప్పడంకు ఇదే నిదర్శణం.అమెరికాలో కూడా దిషా నిందితులకు సంబంధించిన ఎన్కౌంటర్ ఆనందంను కలిగించి ఉంటుంది.
ఇండియాలో మాత్రం ఈ ఎన్కౌంటర్ నిన్న అన్ని పండుగలను తీసుకు వచ్చింది.