గతేడాది నవంబర్ లో తెలంగాణా లో చోటుచేసుకున్న దిశ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.ఈ ఘటనలో ఏ 2 నిందితుగా ఉన్న చెన్నకేశవులు భార్య రేణుక శుక్రవారం రాత్రి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు తెలుస్తుంది.
మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు తెలుస్తుంది.గతేడాది నవంబర్ 29 న అర్ధరాత్రి పూట సాయం చేయి అన్న అని అడిగిన వెటర్నరీ డాక్టర్ దిశ పై అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి,అనంతరం ఆమెపై పెట్రోల్ పోసి మరి తగలబెట్టిన విషయం తెలిసిందే.
ఈ ఘటన దేశవ్యాప్తంగా నిందితుల పై వ్యతిరేకత వ్యక్తం అయ్యింది.అయితే డిసెంబర్ 6 న ఈ ఘటన సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం అని పోలీసులు సంఘటనా స్థలం కి వెళ్ళినప్పుడు ఆ నలుగురు నిందితులు తప్పించుకోవడానికి ప్రయత్నించడం తో పోలీసులు ఎన్కౌంటర్ చేయాల్సి వచ్చింది.
దీనితో ఆ నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.ఈ ఘటన దిశ ఘటన జరిగిన పది రోజులకే చోటుచేసుకోవడం గమనార్హం.
అయితే దిశ ఘటనకు కొద్దీ నెలల ముందే చెన్నకేశవులు రేణుక అనే మైనర్ యువతిని పెళ్లి చేసుకున్నాడు.
అయితే చెన్నకేశవులు చేసిన పనితో ఆమె చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకొని ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
శుక్రవారం రాత్రి మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు రేణుక కు ప్రసవం చేశారు.అయితే ప్రస్తుతం తల్లి,బిడ్డా ఇద్దరూ కూడా క్షేమంగా ఉన్నట్లు తెలుస్తుంది.భర్త చనిపోయే సమయంలో ఆమె గర్భవతిగా ఉన్న విషయం తెలిసిందే.అయితే అలాంటి సమయంలో కూడా భర్త తప్పుచేసినప్పటికీ ఎన్కౌంటర్ లో మృతి చెందడం తో ఆ యువతి న్యాయపోరాటం కి దిగింది.