గత కొద్ది రోజులుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ రాజకీయంగా తన స్పీడ్ పెంచారు.ప్రస్తుతం టిడిపి బలహీనంగా ఉండడం, వైసీపీపై కాస్తోకూస్తో వ్యతిరేకత కనిపిస్తుండటం వంటి కారణాలతో రాబోయే రోజుల్లో తమకు అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో పవన్ ఉన్నట్లుగా కనిపిస్తున్నారు.అదీ కాకుండా.2022లో జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం కూడా ఉండడంతో, ఇప్పటి నుంచే పవన్ స్పీడ్ పెంచినట్లు గా కనిపిస్తున్నారు.ముఖ్యంగా వైసీపీని టార్గెట్ చేసుకుంటూ అనేక కార్యక్రమాలు రూపొందించుకుంటూ వస్తున్నారు.ఇటీవల నివర్ తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన రైతులను పవన్ పరామర్శిస్తూ, ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వస్తున్నారు.
నిన్ననే అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి, కలెక్టర్లకు వినతి పత్రం ఇచ్చే కార్యక్రమాన్ని పవన్ పూర్తి చేశారు.ఆ సందర్భంగా గుడివాడ కు వెళ్ళిన పవన్ అక్కడ ఏపీ మంత్రి కొడాలి నానిపైనా , జగన్ పైనా విమర్శలు చేశారు.
అయితే ఈ సందర్భంగా పవన్ చేసిన కామెంట్స్ పై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
మంత్రి కొడాలి నాని కి కంచుకోటగా ఉన్న గుడివాడలోనే ఆయన వ్యంగ్యంగా సెటైర్లు పవన్ వేశారు.” ఏదైనా ప్రశ్నిస్తే ఒక్కొక్కరు బూతులు తిడుతూ ఉంటారు.ఇక్కడున్న ఎమ్మెల్యే పేరేంటి ? నానీయా ? వైసీపీలో నాని లు ఎక్కువమంది. ఏదో ఒక నాని.ఏ నానినో నాకు అర్థం కావడం లేదు.శతకోటి లింగాల్లో బోడిలింగం.అనేకమంది నాని లలో ఒక నాని.
ఎవరైతే మనకేంటి ? శతకోటి నానీలలో ఒకరైన నానికి చెబుతున్నా.మీ సీఎం సాబ్ కు చెప్పండి.
జగన్ రెడ్డి గారికి అఖిల్ సాబ్ చెప్పాడని చెప్పండి.వచ్చే శాసనసభ సమావేశాల్లో గా నష్టపోయిన రైతులకు 35వేల పరిహారం అందించకపోతే, సైనికులతో కలిసి అసెంబ్లీ ముట్టడికి పిలుపునిస్తాం ” అంటూ వ్యంగ్యంగా విమర్శలు చేశారు.
పవన్ ఈ విమర్శలు చేసే క్రమంలో చూపించిన ఆహా భావాలు సీరియస్ గా కాకుండా, సిల్లిగా ఉండడం తో పవన్ కామెంట్స్ కు అంత స్థాయిలో రెస్పాన్స్ రాలేనట్టుగానే కనిపిస్తోంది.ఈ విమర్శలను సీరియస్ గా చేసి ప్రజల్లో చర్చ జరిగే విధంగా పవన్ వ్యవహరించి ఉంటే ఫలితం వేరేలా ఉండేది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.అది కాకుండా, అకస్మాత్తుగా ఇప్పుడు కొడాలి నానిని టార్గెట్ చేసుకోవడానికి కారణం గత కొంతకాలంగా టిడిపి అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ పై గత కొంతకాలంగా సంచలన విమర్శలు చేస్తున్న క్రమంలోనే, ఇపుడు పవన్ రంగంలోకి దిగి.నానిని టార్గెట్ చేసుకున్నారు అంటూ వైసిపి నాయకులు పవన్ వ్యవహారశైలి పై విమర్శలు చేస్తున్నారు.