ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో బయోపిక్ ట్రెండ్ నడుస్తుంది.జీవిత కథలలో ఎవరివైనా ఇంటరెస్టింగ్ అనిపిస్తే వాటికి దృశ్య రూపం ఇచ్చేందుకు దర్శక, నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు.
బాలీవుడ్ లో అయితే ఇలా వస్తున్న బయోపిక్ లు సూపర్ హిట్ అవుతూ ఉండటంతో ఇతర భాషలలో కూడా బయోపిక్ కథలపై దృష్టి పెడుతున్నారు.ఇక తెలుగులో మహానటితో సావిత్రి బయోపిక్ ని తెరపై ఆవిష్కరించారు.
ఆ సినిమా అద్బుతమైన విజయం సొంతం చేసుకోవడంతో పాటు జాతీయ అవార్డు సైతం గెలుచుకుంది.ఆ సినిమా స్ఫూర్తితో చాలా బయోపిక్ కథలు వచ్చిన ఏ ఒక్కటి అనుకున్న స్థాయిలో సక్సెస్ అవ్వలేదు.
చివరికి ఎన్టీఅర్ బయోపిక్ స్టోరీస్ కూడా డిజాస్టర్ అయ్యాయి.ప్రస్తుతం తెలుగులో కరణం మల్లీశ్వరి బయోపిక్ తెరపైకి ఎక్కడానికి రెడీ అవుతుంది.
ఇదిలా ఉంటే ఒకప్పటి స్టార్ హీరోయిన్, దివంగత నటి ఆర్తి అగర్వాల్ జీవిత కథ ఆధారంగా సినిమా తీయడానికి మేకర్స్ ఆసక్తి చూపిస్తున్నారు.ఈ బయోపిక్ కోసం ఇప్పటికే కీర్తి సురేష్ ని దర్శక నిర్మాతలు అడిగారని ప్రచారం జరుగుతోంది.
ఇప్పుడు మరో బయోపిక్ గురించి టాలీవుడ్ లో చర్చించుకుంటున్నారు.టాలీవుడ్ లో ప్రతి నాయకుడుగా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనదైన ముద్ర వేసిన నటుడు శ్రీహరి.
అతని జీవిత కథతో సినిమా చేయాలని శ్రీ హరి భార్య డిస్కో శాంతి భావిస్తున్నారు.దాని కోసం ఆమె ఇప్పటికే కథని కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తుంది.
ఈ బయోపిక్ కోసం సక్సెస్ ఫుల్ దర్శకుడితో కూడా ఆమె చర్చలు జరుపుతున్నారని బోగట్టా.ఈ కథలో ఆమె కుమారుడు శ్రీహరి పాత్రలో నటించే అవకాశం ఉందని, సెట్ కాకపోతే మరో హీరోని ఆ పాత్రకు ఎంపిక చేసే సూచనలు ఉన్నాయని టాక్ వినిపిస్తుంది.
ఇంకో నిర్మాతతో కలిసి ఆమె ఈ సినిమాని నిర్మించడానికి సిద్ధం అవుతుందని చెప్పుకుంటున్నారు.శ్రీహరి జీవితంలో చిన్ననాటి సంఘటనలు కూడా ఈ సినిమాలో ఉంటాయని తెలుస్తుంది.