టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘సర్కారు వారి పాట‘ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాను పరశురామ్ డైరెక్ట్ చేస్తున్నాడు.
ఇప్పటికే ఈ సినిమా మొదటి షెడ్యూల్ దుబాయ్ లో పూర్తి చేసుకుంది.అక్కడ భారీ యాక్షన్ సీన్స్ తెరకెక్కించాడు డైరెక్టర్.
రీసెంట్ గా రెండవ షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభం అయ్యి కరోనా కారణంగా వాయిదా పడింది.
సామజిక అంశాన్ని స్ఫూర్తిగా తీసుకుని పరశురామ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తుంది.అయితే ఈ సినిమాకు సంబంధించి ఇంత వరకు ఎలాంటి అప్డేట్ రాలేదు.
కనీసం ఫస్ట్ లుక్ కూడా విడుదల కాలేదు.సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా మే 31 న ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల అవ్వబోతుందని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
అయితే వారి ఎదురు చూపులకు నిరాశే మిగలబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.
మహేష్ బాబు ఈసారి కూడా ఫ్యాన్స్ కు నిరాశే అవ్వబోతున్నారని తెలుస్తుంది.మే 31 సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఎదో ఒక అప్డేట్ వస్తుందని ఫ్యాన్స్ ఇప్పటి వరకు అనుకుంటున్నారు.కానీ ప్రసుతం దేశంలో ఉన్న పరిస్థితులు కారణంగా ఇలాంటి సెలెబ్రేషన్స్ కు దూరంగా ఉండబోతున్నారని తెలుస్తుంది.
ప్రజలు కష్టకాలంలో ఉన్న నేపథ్యంలో ఈ వేడుకలను రద్దు చేస్తునట్టు తెలుస్తుంది.ఈ సినిమాకు సంభందించి ఎలాంటి వార్తలు నమ్మవద్దంటూ మహేష్ బృందాలు అధికారికంగా ప్రకటించాయి.ఎప్పటి లాగేనే ఎదో ఒక అప్డేట్ ఉంటుందని అనుకున్న అభిమానులకు తీవ్ర నిరాశే ఎదిరయింది.కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సినిమా నుండి ఎలాంటి అప్డేట్ రాబోదని తెలిపారు.
ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కరోనా కారణంగా వాయిదా పడింది.పరిస్థితులు చెక్కబడిన తర్వాత మళ్ళీ షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు.వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.