టీడీపీ నేత, మాజీమంత్రి దేవినేని ఉమాకు సొంత పార్టీలోనే అసమ్మతి సెగ తగిలింది.నియోజకవర్గంలో దేవినేనికి వ్యతిరేకంగా మరో నేత బొమ్మసాని సుబ్బారావు పార్టీ కార్యక్రమాల్లో స్పీడ్ పెంచారు.
ఈ క్రమంలోనే దేవినేని లేకుండానే బొమ్మసాని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.ఇందులో భాగంగానే తాజాగా పార్టీ ఇంఛార్జ్ దేవినేని లేకుండానే ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన ఇదేం ఖర్మ కార్యక్రమాన్ని చేపట్టారు.
దేవినేని ఉమా నాన్ లోకల్ అంటూ బొమ్మసాని కొంతకాలంగా ప్రచారం చేస్తున్నారని తెలుస్తోంది.