ప్రభాస్ ‘సాహో’ చిత్రం ఫ్లాప్ క్రెడిట్ పూర్తిగా సుజీత్పైనే పడింది.ఆయన ప్రభాస్కు ఉన్న ఇమేజ్ను ఉపయోగించుకోవడంలో దారుణంగా విఫలం అవ్వడం మాత్రమే కాకుండా అత్యంత దారుణంగా ప్రభాస్ కెరీర్లో మచ్చను క్రియేట్ చేశాడంటూ అభిమానులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
ఎంతమంది ఎన్ని విధాలుగా ట్రోల్స్ చేస్తున్నా కూడా సుజీత్ మాత్రం పెద్దగా రియాక్ట్ అవ్వకుండానే ఉంటున్నాడు.ప్రస్తుతం సుజీత్ ఇంకా సినిమా ప్రమోషన్స్లోనే బిజీగా ఉన్నాడు.
మూడు పదుల వయసు కూడా లేని ఈ కుర్ర దర్శకుడు ఏకంగా 350 కోట్ల బడ్జెట్తో సినిమా తీసినప్పుడే అంతా అనుమానాలు వ్యక్తం చేశారు.కాని తనకున్న షార్ట్ ఫిల్మ్స్ అనుభవంతో సినిమాను దుమ్ము లేపుతాడని కొందరు భావించారు.కాని అనూహ్యంగా ఫలితం తారు మారు అయ్యింది.ఇక తాజాగా సుజీత్ సోషల్ మీడియాలో ‘సాహో’ చిత్రం చూసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పాడు.సినిమా గురించి ట్రోల్స్ చేస్తున్న వారిని నేను పట్టించుకోనని, సినిమా చూసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అన్నాడు.
అదే సమయంలో సినిమాను మరోసారి చూడాల్సిందిగా ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశాడు.
చూసిన వారు మళ్లీ చూసే విధంగా సాహో లేదు.సుజీత్ చేసిన రిక్వెస్ట్పై సోషల్ మీడియాలో తెగ కామెంట్స్ వస్తున్నాయి.
నువ్వు చేసిన కళాకండంను ఒక్కసారి చూడటమే చాలా ఎక్కువ.అలాంటిది నువ్వు మళ్లీ చూడమంటే ఎలా భయ్యా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
సాహో చిత్రంను మళ్లీ చూసేంత సాహసం నేను చేయలేను భయ్యా అంటూ కొందరు, వామ్మో మళ్లీ ఎలా చూస్తాం భయ్యా అంటూ ఇంకొందరు అలా రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.