టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్కారీ వారి పాట చిత్రంతో బిజీగా ఉన్నారు.ఇప్పటికే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఆగిపోవడంతో అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోంది.దీన్ని బట్టి చూస్తుంటే మహేష్ బాబు ప్రస్తుతం కొన్ని సంవత్సరాలపాటు ఎంతో బిజీగా ఉండబోతున్నారని తెలుస్తోంది.
పరశురామ్ దర్శకత్వంలో సర్కారీ వారి పాట చిత్రం పూర్తికాగానే మహేష్ బాబు అనంతరం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయనున్నారు.ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టారు.
ఈ సినిమా అయిన అనంతరం దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు బిజీ కానున్నారు.రాజమౌళి సినిమా అంటే ఒక రెండు మూడు సంవత్సరాల పాటు మహేష్ బాబు కోసం ఇతర దర్శకులు ఎదురుచూడటం వృధా అని చెప్పవచ్చు.
ఇక రాజమౌళి తర్వాత మహేష్ బాబుతో సినిమాలు చేయడం కోసం అనిల్ రావిపూడి సిద్ధంగా ఉన్నారు.
2020 సంవత్సరంలో సరిలేరు నీకెవ్వరు సినిమా ద్వారా మంచి విజయాన్ని అందుకున్న అనిల్ రావిపూడికి మహేష్ బాబు తనతో మరొక సినిమా చేస్తానని మాట ఇచ్చినట్లు సమాచారం.ఈ క్రమంలోనే అనిల్ రావిపూడి మహేష్ కోసం మంచి కథను సిద్ధం చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.ఇక మహేష్ బాబు కోసం కొన్ని సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్న డైరెక్టర్లలో సందీప్ రెడ్డి వంగా ఒకరు.
అదేవిధంగా వీరితోపాటు వంశీ పైడిపల్లి, సుకుమార్, పూరి జగన్నాథ్, కొరటాల శివ వంటి స్టార్ డైరెక్టర్ లందరూ మహేష్ బాబు కోసం ఎదురు చూస్తున్నట్లు సమాచారం.దీన్ని బట్టి చూస్తే ఇప్పుడిప్పుడే మహేష్ బాబు డేట్స్ ఎవరికి దొరకవని చెప్పాలి.