డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మొత్తానికి ఇస్మార్ట్ శంకర్ తో బాక్స్ ఆఫీస్ హిట్ కొట్టి ఫామ్ లోకి వచ్చేశాడు.అయితే ఈ దర్శకుడు ఇటీవల ఇంటర్వ్యూలలో ఊహించని కామెంట్స్ తో స్టార్ హీరోలకు షాకిస్తున్నాడు.
ఆ సంగతి పక్కనపెడితే నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తాడు అనేది హాట్ టాపిక్ గా మారింది.
విజయదేవరకొండ తో వర్క్ చేసే అవకాశం ఉందని టాక్ వచ్చినప్పటికీ అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియదు.
అయితే మెగాస్టార్ ఒప్పుకుంటే నాలుగైదు రోజుల్లో ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేస్తానని స్మార్ట్ ఆన్సర్ ఇస్తున్నాడు.అసలైతే గతంలో చిరు కమ్ బ్యాక్ ఫిల్మ్ 150వ సినిమా కోసమని పూరి ఒక కథను సెట్ చేసుకున్న సంగతి తెలిసిందే.
ఆటో జానీ అనే ఆ కథ మెగాస్టార్ కి బాగా నచ్చినప్పటికి ఫుల్ సోషల్ మెస్సేజ్ తో కూడిన అంశం ఉండాలని తన ఆలోచనను మార్చుకున్నారు.అయితే ఆ తరువాత మరికొన్ని సందర్భాల్లో ప్రాజెక్ట్ చేద్దామని అనుకున్నప్పటికి కుదరలేదట.అయితే ఇప్పుడు మెగాస్టార్ ఒక్క సైగ చేస్తే చాలు ఫుల్ స్క్రిప్ట్ ని జెట్ స్పీడ్ లో పూర్తి చేస్తానని పూరి చెబుతున్నాడు.మరి మెగాస్టార్ ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో చూడాలి.