యాంగ్రీ స్టార్ రాజశేఖర్ ఇటీవల చాలా సెలెక్టివ్గా సినిమాలు చేస్తూ వస్తున్నాడు.గరుడవేగ చిత్రంతో అదిరిపోయే కమ్బ్యాక్ ఇచ్చిన ఈ హీరో, ఆ తరువాత కల్కి లాంటి విజయవంతమైన చిత్రంలో నటించాడు.
అయితే ఈ సినిమా తరువాత రాజశేఖర్ తన నెక్ట్స్ చిత్రాన్ని జాతీయ అవార్డు డైరెక్టర్ నీలకంఠ డైరెక్షన్లో తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు.ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైన సంగతి తెలిసిందే.
అయితే కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.కాగా తాజాగా ఈ సినిమా నుండి డైరెక్టర్ వాకౌట్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ సినిమా షూటింగ్ విషయంలో హీరో రాజశేఖర్, దర్శకుడు నీలకంఠ మధ్య మనస్పర్థలు వచ్చిన కారణంగా ఈ సినిమా నుండి డైరెక్టర్ వాకౌట్ చేసినట్లు చిత్ర వర్గాలు చర్చించుకుంటున్నాయి.కానీ ఈ విషయంపై ఇంకా ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు.
దీంతో యాంగ్రీ స్టార్ నెక్ట్స్ చిత్రాన్ని ఎవరు డైరెక్ట్ చేస్తారా అనే సందేహం ప్రస్తుతం అందరిలో నెలకొంది.ఏదేమైనా సినిమా మధ్యోలో నుండి డైరెక్టర్ వాకౌట్ చేయడంతో ఇప్పుడు ఇది ఫిలింనగర్లో హాట్ టాపిక్గా మారింది.
ఓ పక్క ప్రతి హీరో తమ సినిమాకు సంబంధించి రిలీజ్ డేట్ను అనౌన్స్ చేస్తూ బిజీగా ఉంటే, రాజశేఖర్ మాత్రం తన సినిమాకు సంబంధించి ఇంకా ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడం ఏమిటని పలువురు అంటున్నారు. ఇక ఈ సినిమాను పూర్తి క్రైమ్ థ్రిల్లర్ మూవీగా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తున్నారు.
మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నట్లు తెలుస్తోంది.కాగా ఈ సినిమాలో హీరోయిన్గా అందాల భామ రిచా పనాయ్ నటిస్తోన్నట్లు, ఈ సినిమాను ఎంఎల్వి సత్యనారాయణ ప్రొడ్యూస్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
మరి రాజశేఖర్ ఈ సినిమాను కంటిన్యూ చేస్తాడా లేక వేరే ప్రాజెక్టును ఓకే చేసి దీన్ని పక్కనబెట్టేస్తాడా అనేది తెలియాలంటే ఏదైనా అప్డేట్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే.