కెరీర్ మొదట్లో చిత్రం, నువ్వునేను, మనసంతా నువ్వే సినిమాలతో వరుస విజయాలు సొంతం చేసుకుని హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఉదయ్ కిరణ్.బ్యాక్ గ్రౌండ్ లేకుండా హీరోగా స్వయంకృషితో హీరోగా ఎదిగిన ఉదయ్ కిరణ్ మనసంతా నువ్వే సినిమా తరువాత హీరోగా నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు.2014 సంవత్సరం జనవరి 5వ తేదీన ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నారు.
ఉదయ్ కిరణ్ ఆత్మహత్య గురించి ఇండస్ట్రీ వర్గాల్లో అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి.
ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన మనసంతా నువ్వే, శ్రీరామ్ సినిమాలకు దర్శకత్వం వహించిన వి ఎన్ ఆదిత్య ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఉదయ్ కిరణ్ గురించి, ఉదయ్ కిరణ్ ఆత్మహత్య గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.ఉదయ్ కిరణ్ చనిపోవడానికి ఐదు రోజుల ముందు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పడానికి తనకు కాల్ చేశాడని వీఎన్ ఆదిత్య అన్నారు.
ఆరోజు కొన్ని గంటల పాటు ఉదయ్ కిరణ్ తనతో మాట్లాడాలని.వివిధ అంశాల గురించి అభిప్రాయాలను పంచుకున్నాడని.ఆ కాల్ లో పవన్ హీరోగా తెరకెక్కి బ్లాక్ బస్టర్ హిట్టైన అత్తారింటికి దారేది సినిమా కథను సైతం మెచ్చుకున్నాడని ఆదిత్య వెల్లడించారు.అయితే అంత బాగా మాట్లాడిన ఉదయ్ ఆత్మహత్య చేసుకుంటాడని తాను అస్సలు ఊహించలేదని వీ ఎన్ ఆదిత్య తెలిపారు.
ఆర్థిక సమస్యల వల్ల ఉదయ్ చనిపోయినట్టు ప్రచారం జరగగా ఆ ప్రచారం నిజం కాదని అన్నారు.
తనకు తెలిసినంత వరకు ఉదయ్ కిరణ్ కు భార్యతో కూడా ఎటువంటి గొడవలు లేవని వెల్లడించారు.
క్షణికావేశం వల్లే ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని తాను భావిస్తున్నానని.ఒక అద్భుతమైన నటుడిని మిస్ అయ్యామని అన్నారు.