పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీగా వచ్చిన సినిమా వకీల్ సాబ్.ఈ సినిమా ఈ రోజే విడుదల అయ్యి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటుంది.
పవర్ స్టార్ మ్యానియా ఈ సినిమాపై బాగానే పనిచేసిందని చెప్పాలి.ఈ సినిమా ఏకంగా 2175 థియేటర్స్ లో విడుదల అయినట్టు సమాచారం.
ఈ స్థాయిలో సౌత్ మూవీలు రిలీజ్ అవ్వడం రికార్డ్ అనే చెప్పాలి.బాలీవుడ్ సినిమాల్లోనే ఈ స్థాయిలో అరుదుగా విడుదల అవుతుంటాయి.
అన్ని థియేటర్స్ దగ్గర ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు.మూడు సంవత్సరాల తర్వాత తెర మీద కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి.వకీల్ సాబ్ సినిమాను వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేసారు.ఈ సినిమాలో పవన్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది.
అంజలి, నివేతా థామస్ కీలక పాత్రల్లో నటించారు.
ఈ సినిమా పింక్ సినిమా రీమేక్ గా తెరకెక్కింది.పింక్ సినిమాలో అమితాబ్ నటించాడు.ఒరిజనల్ సినిమాలో అమితాబ్ పాత్ర నిడివి చాలా తక్కువుగా ఉంటుంది.
కానీ ఇక్కడ తెలుగులో మాత్రం పవన్ పాత్రను ఆయన రేంజ్ కు తగ్గట్టుగా మార్పులు చేయడంతో దాదాపు 50 నిముషాలపాటు కనిపించబోతున్నాడు.ఇందులో పవన్ కళ్యాణ్ లాయర్ గా కనిపించాడు.
అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా డైరెక్టర్ వేణు శ్రీరామ్ ఒక ఇంటర్వ్యూ లో ఒక ఆసక్తికర విషయాన్నీ పంచుకున్నారు.ఈ సినిమాలో నటించడానికి పవన్ కళ్యాణ్ ఒప్పుకోకపోయి ఉంటే తాను ఎవరిని అంచుకునేవాడో ఈ ఇంటర్వ్యూ లో తెలిపాడు.
ఈ కథ మహిళలు చుట్టూ తిరుగుతుంది కాబట్టి పవన్ నో చెప్పి ఉంటె నేను నాగార్జున ను సెలెక్ట్ చేసుకునే వాడిని.ఎందుకంటే ఆయన ఈ పాత్రలో ఖచ్చితంగా సరిపోతారు అని వేణు శ్రీరామ్ స్పందించారు.