టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ డైరెక్టర్లలో దర్శకుడు తేజ ఒకరనే సంగతి తెలిసిందే.జయం, నువ్వునేను, చిత్రం, నేనేరాజు నేనేమంత్రి సినిమాలతో విజయాలను సొంతం చేసుకున్న తేజ సినీ కెరీర్ లో సక్సెస్ ల కంటే ఫెయిల్ అయిన సినిమాలే ఎక్కువగా ఉన్నాయి.
సీన్ లో సరిగ్గా నటించకపోతే ఆర్టిస్టులను తేజ కొడతారనే పేరు ఉంది.అయితే తేజ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసి తర్వాత కాలంలో డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్లలో వీరభద్రం చౌదరి ఒకరు.
ఆహ నా పెళ్లంట, పూలరంగడు, భాయ్ సినిమాలను తెరకెక్కించిన వీరభద్రం చౌదరి తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వీరభద్రం చౌదరి రసూల్ గారితో ఒక సినిమాను చేశానని చెప్పుకొచ్చారు.కొంతమంది నిర్మాతలు అడ్వాన్స్ లు ఇచ్చారని నిర్మాతలు దేవుళ్లు అని వీరభద్రం చౌదరి అన్నారు.
నాపై నమ్మకంతో చాలామంది నిర్మాతలు ఉన్నారని వాళ్ల నమ్మకాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తానని వీరభద్రం చౌదరి తెలిపారు.
అసిస్టెంట్ డైరెక్టర్, కో డైరెక్టర్ గా ఉన్న సమయంలో డబ్బులు సరిపోయేవని డైరెక్టర్ గా ఉన్న సమయంలో మెయింటనెన్స్ కే ఎక్కువ మొత్తంలో ఖర్చవుతుందని వీరభద్రం చెప్పుకొచ్చారు.
తేజ గారు డైరెక్షన్ డిపార్టుమెంట్ వాళ్లతో బ్రహ్మాండంగా ఉంటారని ఆయన అనుకున్న ఎక్స్ ప్రెషన్ రాకపోతే కోపం వస్తుందని అంతకు మించి ఏం లేదని వీరభద్రం చౌదరి చెప్పుకొచ్చారు.
తేజ ఎంతోమందిని పెద్దపెద్ద స్టార్స్ ను చేశాడని తేజ గారు ఎంతో ఫ్రెండ్లీగా ఉంటారని వీరభద్రం చౌదరి తెలిపారు.తేజగారు ఫ్రీడమ్ ఇస్తారని అందువల్ల తాను కూడా తన దగ్గర పని చేసేవాళ్లకు ఫ్రీడమ్ ఇచ్చానని వీరభద్రం చౌదరి తెలిపారు.ఈ మధ్య కాలంలో సరైన విజయం లేని వీరభద్రం చౌదరి మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి వస్తారేమో చూడాల్సి ఉంది.